E-Paper
Advertisement

శ్రీలంక ఓటమి..8వ సారి ఆసియాకప్ ఛాంపియన్​గా టీమిండియా, ప్రైజ్ మనీ ఎంత అంటే

శ్రీలంక ఓటమి..8వ సారి ఆసియాకప్ ఛాంపియన్​గా టీమిండియా, ప్రైజ్ మనీ ఎంత అంటే
Advertisement

Womens Asia Cup 2026 Finals IND VS SL: ఉమెన్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ ( Asia Cup 2026 tournament ) విజేతగా అందరూ ఊహించినట్లుగానే టీమిండియా నిలిచింది. ఈ టోర్నమెంట్ లో ఒక్క ఓటమి లేకుండా చివరి వరకు గెలుస్తూ వచ్చిన ఉమెన్స్ టీమిండియా, 2026 ఆసియా కప్ కూడా గెలుచుకుంది. ఈ క్రమంలో 8వ సారి ఆసియా కప్ విజేతగా నిలిచింది. దుబాయ్ లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంక జట్టును అన్ని విధాల దెబ్బ కొట్టి… 72 పరుగుల తేడాతో విక్టరీ అందుకుంది.

ఆసియా కప్ 2026 టోర్నమెంట్ విజేతగా టీమిండియా

ఉమెన్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఆదివారం రోజున టీమిండియా వర్సెస్ శ్రీలంక మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. దుబాయ్ లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టీమిండియానే మొదట బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా ఉమెన్స్ టీం, నిర్ణీత 20 ఓవర్లు ఆడింది. ఈ క్రమంలో ఐదు వికెట్లు నష్టపోయిన ఉమెన్స్ టీమ్ ఇండియా 183 పరుగులు సాధించింది.

Advertisement

ఓపెనర్లు షెఫాలీ వర్మ 68 పరుగులు చేయగా, స్మృతి మందాన 59 పరుగులతో ఇరగదీశారు. దీంతో టీమిండియా ఉమెన్స్ టీం ఫైనల్స్ లో భారీ స్కోర్ చేయగలిగింది. అయితే ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పడుతూ లేస్తూ శ్రీలంక ఉమెన్స్ టీం పోరాడింది. అయినప్పటికీ మ్యాచ్ మాత్రం గెలవలేక చేతులెత్తేసింది. టీమిండియా ఉమెన్స్ టీం విధించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నిర్ణీత 20 ఓవర్లు ఆడిన శ్రీలంక ఉమెన్స్ టీమ్, 111 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. ఈ క్రమంలో 8వ సారి ఛాంపియన్ గా నిలిచింది టీమిండియా ఉమెన్స్ టీం.

PCB confiscate mobile phones of Pakistan cricketers : పాకిస్తాన్ జ‌ట్టులో పెను ప్ర‌కంప‌న‌లు…ప్లేయ‌ర్ల మొబైల్ ఫోన్లను లాగేసుకున్న PCB

ఆసియా కప్ 2026 టోర్నమెంట్ ప్రైజ్ మనీ ఎంత అంటే ?

Advertisement

ఉమెన్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ విజేతగా టీమిండియా నిలిచింది. ఈ క్రమంలో చాంపియన్ అయిన టీమ్ ఇండియాకు ఒక్క రూపాయి కూడా రాబోదు. ప్రైజ్ మనీ గా వచ్చిన డబ్బులను బీసీసీఐ అస్సలు స్వీకరించబోదు. వచ్చిన ప్రైజ్ మనీ (Asia Cup 2026 tournament prize money)సొమ్మును ఆసియా ఖండంలోని ఇతర చిన్న క్రికెట్ బోర్డుల అభివృద్ధి అలాగే మౌలిక సదుపాయాల కోసం బీసీసీఐ మళ్ళీ విరాళంగా ఇస్తుంది. అయితే టీమిండియా కాక ఫైనాన్స్లో శ్రీలంక గెలిచి ఉంటే మాత్రం రూల్స్ ప్రకారం ప్రైజ్ మనీ తీసుకునేది. ఇక ఈ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన జట్టుకు రూ.16 నుంచి రూ.20 లక్షల వరకు ప్రైస్ మనీ అందిస్తారు. అంటే ప్రైజ్ మనీ కింద వచ్చిన ఈ డబ్బులను ఆసియా ఖండంలోని ఇతర చిన్న జట్లకు ఖర్చు పెడుతుంది బీసీసీఐ.

Tanveer Ahmed On IND VS PAK: అదరగొట్టిన ఇండియా, పాకిస్తాన్ మరో ఘోర ఓటమి…ఫిక్సింగ్ చేశారంటూ త‌న్వీర్ ఆరోప‌ణ‌లు

 

Related News

అదరగొట్టిన టీమిండియా..తొలి టీ20 ఆఫ్ఘనిస్తాన్ ఓటమి..తెరపైకి వందేమాతరం వివాదం !

పాకిస్తాన్ జట్టుకు భారతీయుల దిష్టి తగిలింది..అందుకే ఓడిపోతోంది

రాజస్థాన్ ను వదిలేసి LSGలోకి వచ్చేయ్.. నా ఆస్తులు రాసి ఇస్తా !

ఫిక్సింగ్ చేసి ఫైనల్స్ కు వచ్చారు..లంక చేతిలో చిత్తుగా ఓడిపోవడం పక్కా

రన్స్ చేయకపోతే..గొంతు నొక్కి చంపేస్తానని సచిన్ కు వార్నింగ్ ఇచ్చా !

అనిల్ కుంబ్లే కుక్క కంటే హీనంగా కోహ్లీ ట్రీట్ చేసాడు..!

400 మంది కొత్త ప్లేయర్లను తీసుకోని, పాకిస్తాన్ జట్టును తయారు చేయండి

Big Stories

Advertisement
×