Smriti Mandhana: భారత స్టార్ క్రికెటర్ స్మృతి మందాన, మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చల్ తో జరగాల్సిన తన పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్లు ఇన్స్టాగ్రామ్ స్టోరీ లో ప్రకటించిన విషయం తెలిసిందే. నవంబర్ 23న జరగాల్సిన వీరి పెళ్లి అనుకోని కారణాలవల్ల వాయిదా పడింది. ఆ తర్వాత వీరి పెళ్లి ఆగిపోవడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.
Also Read: Shubman Gill: గిల్ కుట్రలు..నేను ఆడకపోతే మ్యాచే రద్దు కావాలి, లక్నో స్టేడియంలోకి పొగ మంచు పంపి మరీ!
అదే సమయంలో స్మృతి మందాన తన సోషల్ మీడియా అకౌంట్ నుండి పెళ్లికి సంబంధించిన పోస్టులను డిలీట్ చేయడం, పలాష్ కి సంబంధించిన పాత చాట్ సోషల్ మీడియాలో దర్శనమివ్వడం, ఇవన్నీ కలిపి నెటిజెన్లలో అనేక అనుమానాలను మరింత పెంచాయి. అనేక ఊహగానాల అనంతరం పెళ్లి రద్దయిందని ఇద్దరు సోషల్ మీడియా వేదికగా వేరువేరుగా ప్రకటించారు. ఇలా పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించిన పది రోజుల అనంతరం తొలిసారి ఓ కార్యక్రమానికి హాజరైంది స్మృతి మందాన.
పలాష్ ముచ్చల్ తో తన వివాహం రద్దు అయిన తర్వాత స్మృతి తొలిసారి క్యూట్ లుక్స్ లో మెరిసింది. దీంతో ఈ లేటెస్ట్ లుక్ వైరల్ గా మారింది. ఓ ప్రైవేట్ ఈవెంట్ లో పాల్గొని ఆమె సందడి చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. తాజాగా బెంగుళూరులో జరిగిన ఓ మొబైల్ కంపెనీ ప్రోగ్రాం కి హాజరై.. సరదాగా కనిపించింది. వైట్ డ్రెస్ లో అదిరిపోయే లుక్ లో కనిపించింది స్మృతి. అయితే వన్ ప్లస్ బ్రాండ్ 12వ వార్షికోత్సవం సందర్భంగా బ్రాండ్ అంబాసిడర్ గా స్మృతి ని ప్రకటించినట్లు తెలుస్తోంది.
ఇందులో భాగంగానే బెంగుళూరులో “one plus rice as one” కార్యక్రమం జరిగింది. ఈ ఈవెంట్ కి స్మృతి మందాన హాజరైంది. అయితే ఈ కార్యక్రమంలో గతంలో ఎన్నడు లేని విధంగా కొత్త లుక్ లో కనిపించింది. ఈ కార్యక్రమంలో స్మృతి మందానని చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు. వివాహం రద్దు అయిన తరువాత మరింత అందంగా కనిపిస్తోందని కొంతమంది కామెంట్స్ చేస్తుంటే.. పెళ్లి రద్దు అయిన విషయాన్ని మరిచిపోయేందుకు ఇలా జనాల మధ్యకు వచ్చి సందడి చేస్తుందని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. అలాగే దృఢమైన మనసు కలిగిన మహిళ అని, గతంలో మాదిరి క్రికెట్ కూడా ఆడుతుందని అభినందిస్తున్నారు.
Also Read: LIONEL MESSI: క్రైస్తవుడైన మెస్సీతో శివనామ స్మరణం చేయించిన అంబానీ.. ఇదిరా ఇండియా అంటే ?
డిసెంబర్ 21వ తేదీ నుండి భారత్ – శ్రీలంక మహిళా జట్ల మధ్య 5 టి-20 ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం మళ్లీ మైదానంలో అడుగుపెట్టనుంది స్మృతి. ప్రస్తుతం ఈమె టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ గా కొనసాగుతుంది. ఈ సిరీస్ అనంతరం జనవరి 9 నుండి మహిళల ప్రీమియర్ లీగ్ కూడా ప్రారంభమవుతుంది. ముఖ్యంగా స్వదేశంలో శ్రీలంకతో డిసెంబర్ 21 నుండి 30 వరకు జరిగే ఐదు మ్యాచ్ ల టీ-20 సిరీస్ కోసం ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను స్మృతి సోదరుడు ఇన్స్టా స్టోరీస్ లో షేర్ చేశాడు. ఈ ఫోటోలు చూసిన అభిమానులు “స్మృతి ఈజ్ బ్యాక్” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.