Smriti Mandhana : టీమిండియా స్టార్ మహిళా క్రికెటర్ స్మృతీ మంధాన తన భాయ్ ఫ్రెండ్ ను ఇటీవల పరిచయం చేసిన విషయం తెలిసిందే. గత ఏడాది జులై 27న తన పుట్టిన రోజు సందర్భంగా తన భాయ్ ఫ్రెండ్ పలాష్ ముచ్చల్ ని పరిచయం చేశారు. తమ ప్రేమ విషయం ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డ ఈ జంట.. ప్రస్తుతం జంటగా తిరుగుతున్నారు. గతంలో స్మృతీ, పలాష్ లు బహిరంగంగా ఒకరి గురించి ఒకరు ఇప్పటివరకు ఎక్కడా మాట్లాడలేదు. అయితే కొద్ది రోజులు గోప్యంగా ఉంచినట్టు పలాష్ ముచ్చల్ చెప్పుకొచ్చాడు. అందుకు కారణం కూడా వెల్లడించాడు.
Also Read : Mumbai Indians: అంబానీ కుట్రలు.. పేపర్ పంపించి ఫిక్సింగ్…ఇంత దారుణమా ?
“నాకు సిగ్గు, బిడియం కాస్త ఎక్కువ. ఈవెంట్, పార్టీలలో ఫొటోలు దిగే సమయంలోనూ సిగ్గుపడతాను. స్మృతీమంధాన బాయ్ ఫ్రెండ్ ని అయినందుకు నేను గర్వపడుతున్నా. నా వ్యక్తి గత జీవితానికి సంబంధించిన విషయాలను గోప్యంగా ఉంచడానికి ఇష్టపడతా. అందుకే ఇన్నిరోజులు మా రిలేషన్ పై మాట్లాడలేదు. మహిళల ప్రీమియర్ లీగ్ సమయంలో నేను స్మృతీ మంధాన స్మృతీ మంధానతో మైదానంలో ఉన్నప్పుడు కెమెరా కూడా చూడలేదు. కెమెరా మా వైపు తిరిగిందంటే.. అక్కడి నుంచి వెళ్లిపోయేవాడిని. ఇప్పుడు మా రిలేషన్ గురించి అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు అలాంటివి చేయడం లేదు. నేను ఎక్కడికీ వెళ్లినా ఆర్సీబీ, ఆర్సీబీ అంటూ ఫ్యాన్స్ కేరింతలు కొడుతున్నారు. అది నాకు సంతోషంగానే ఉంది”అని పలాష్ తెలిపాడు.
ప్రియుడితో స్మృతి మందన..
తాజాగా వీరికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే గత ఏడాది స్మృతి మంధాన కెప్టెన్సీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి మహిళల ప్రీమియర్ లీగ్ 2024 టైటిల్ను గెలుచుకుంది. ఆదివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టైటిల్ గెలిచిన తర్వాత స్మృతి మంధాన తన ప్రియుడితో కలిసి కనిపించింది. స్మృతి మంధాన తన బాయ్ఫ్రెండ్ పలాష్ ముచ్చల్తో కలిసి WPL ట్రోఫీని పట్టుకుని ఫొటో దిగింది. ఆ ఫోటో కూడా తెగ వైరల్ అయింది. స్మృతి మంధాన ప్రియుడు పలాష్ ముచ్చల్ కూడా ఓ సెలబ్రిటీనే. ఆయనకు సొంతంగా అభిమానుల ఫాలోయింగ్ ఉంది. కోట్లలో డబ్బు సంపాదిస్తాడు. ముఖ్యంగా, స్మృతి మంధాన తన ప్రియుడు పలాష్ ముచ్చల్ కంటే ఎక్కువ సంపాదిస్తుంది. WPL అత్యంత ఖరీదైన క్రీడాకారిణి, టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన మొత్తం నికర విలువ రూ. 33.29 కోట్లుగా తేలింది. అయితే, మంధాన ప్రియుడు, గాయకుడు-దర్శకుడు పలాష్ ముచ్చల్ నికర విలువ రూ. రూ. 20 నుంచి రూ.30 కోట్లు అని చెబుతున్నారు. మొత్తానికి ప్రియుడితో కలిసి స్మృతి మంధాన తెగ ఎంజాయ్ చేస్తోందని సోషల్ మీడియాలో వైరల్ కావడం విశేషం.