E-Paper
Advertisement

T20 WORLDCUP : టీ20 వరల్డ్ కప్ లో భారత్ జోరు

T20 WORLDCUP : టీ20 వరల్డ్ కప్ లో భారత్ జోరు
Advertisement

T20 WORLDCUP : టీ20 వరల్డ్ కప్ లో భారత్ జోరు కొనసాగుతోంది. మొదటి మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను చిత్తు చేసిన రోహిత్ సేన.. రెండో మ్యాచ్ లో నెదర్లాండ్స్ ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాంటిగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లు రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 179 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (9 పరుగులు) మరోసారి నిరాస పర్చాడు. అయితే రోహిత్ ( 53), కోహ్లీ (62) , సూర్యకుమార్ యాదవ్ (51) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. 180 పరుగులతో బరిలోకి దిగిన నెదర్లాండ్ ను భారత్ బౌలర్లు కట్టడి చేశారు. వరస విరామాల్లో వికెట్లు పడగొట్టారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో నెదర్లాండ్స్ జట్టు 9 వికెట్లు కోల్పోయి 123 పరుగులు మాత్రమే చేయగలింది. రోహిత్ సేన 56 పరుగుల భారీ తేడాతో గెలిచింది. భువనేశ్వర్, అర్షదీప్, అక్షర్ పటేల్ , అశ్విన్ రెండేసి వికెట్లు చొప్పున పడగొట్టగా షమీకి ఒక వికెట్ దక్కింది. వరసగా రెండు మ్యాచ్ లో గెలిచిన టీమిండియా గ్రూప్2 లో అగ్రస్థానంలో ఉంది. 25 బంతుల్లో 51 పరుగులతో నాటౌట్ గా నిలిచిన సూర్యకుమార్ యాదవ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఆదివారం పెర్త్ వేదికగా జరిగే మ్యాచ్ లో టీమిండియా- దక్షిణాఫ్రికాతో తలపడనుంది.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×