BigTV English

T20 WORLDCUP : టీ20 వరల్డ్ కప్ లో భారత్ జోరు

T20 WORLDCUP : టీ20 వరల్డ్ కప్ లో భారత్ జోరు

T20 WORLDCUP : టీ20 వరల్డ్ కప్ లో భారత్ జోరు కొనసాగుతోంది. మొదటి మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను చిత్తు చేసిన రోహిత్ సేన.. రెండో మ్యాచ్ లో నెదర్లాండ్స్ ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాంటిగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లు రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 179 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (9 పరుగులు) మరోసారి నిరాస పర్చాడు. అయితే రోహిత్ ( 53), కోహ్లీ (62) , సూర్యకుమార్ యాదవ్ (51) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. 180 పరుగులతో బరిలోకి దిగిన నెదర్లాండ్ ను భారత్ బౌలర్లు కట్టడి చేశారు. వరస విరామాల్లో వికెట్లు పడగొట్టారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో నెదర్లాండ్స్ జట్టు 9 వికెట్లు కోల్పోయి 123 పరుగులు మాత్రమే చేయగలింది. రోహిత్ సేన 56 పరుగుల భారీ తేడాతో గెలిచింది. భువనేశ్వర్, అర్షదీప్, అక్షర్ పటేల్ , అశ్విన్ రెండేసి వికెట్లు చొప్పున పడగొట్టగా షమీకి ఒక వికెట్ దక్కింది. వరసగా రెండు మ్యాచ్ లో గెలిచిన టీమిండియా గ్రూప్2 లో అగ్రస్థానంలో ఉంది. 25 బంతుల్లో 51 పరుగులతో నాటౌట్ గా నిలిచిన సూర్యకుమార్ యాదవ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఆదివారం పెర్త్ వేదికగా జరిగే మ్యాచ్ లో టీమిండియా- దక్షిణాఫ్రికాతో తలపడనుంది.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×