Tanveer Ahmed On Abhishek vs Babar: ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ (India vs Afghanistan) మధ్య జరిగిన మూడవ టి20 సందర్భంగా అభిషేక్ శర్మ (Abhishek Sharma) సెంచరీతో ఇరగదీసిన సంగతి తెలిసిందే. అయితే అభిషేక్ శర్మ 30 బంతుల్లో సెంచరీ చేసిన నేపథ్యంలో, పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఫ్లాట్ మైదానాలలో సెంచరీలు చేయడం మగతనం కాదని, దమ్ముంటే పాకిస్తాన్ టెస్ట్ కెప్టెన్ బాబర్ ఆజం (Babar Azam) తరహాలో ఆడాలని సవాల్ విసిరారు. అప్పుడే, అభిషేక్ శర్మను తాను మంచి బ్యాటర్ అని మెచ్చుకుంటానని వ్యాఖ్యానించారు. అప్పటివరకు అభిషేక్ శర్మపై ప్రశంసల వర్షం కురిపించేది లేదంటూ బాంబు పేల్చారు. ఇండియాలో అన్ని ప్లాట్ మైదానాలేనని పేర్కొన్న ఆయన… దమ్ము ధైర్యం ఉంటే విదేశీ గడ్డలపై సెంచరీలు చేసి చూపించాలని సంచలన ప్రకటన చేశారు. అభిషేక్ శర్మ పై తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
ఆఫ్గనిస్తాన్ తో జరిగిన మూడో టి20 సందర్భంగా అభిషేక్ శర్మ 30 బంతుల్లోనే సెంచరీ నమోదు చేశాడు. దీంతో టెస్ట్ హోదా కలిగిన జట్లలో… తక్కువ బంతుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన టి20 ఆటగాడిగా హిస్టరీ క్రియేట్ చేశాడు అభిషేక్ శర్మ. అయితే అభిషేక్ శర్మ పై అందరూ ప్రశంశాల వర్షం కురిపిస్తుంటే.. పాకిస్తాన్ మాజీలు మాత్రం రెచ్చిపోతున్నారు. లేటెస్ట్ గా తన్వీర్ అహ్మద్ కూడా విమర్శలు చేశారు. ఇండియాలో అన్ని ఫ్లాట్ మైదానాలేనని పేర్కొన్నారు. ఈ పిచ్ ల పైన ప్రతి ఒక్కరూ, సులభంగా సెంచరీలు చేయడం కామన్ అన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కోసం కూడా ఇలాంటి చెత్త మైదానాలు తయారు చేస్తున్నారని బీసీసీఐపై ఫైర్ అయ్యారు. ప్లాట్ మైదానాలకు అలవాటైన టీమిండియా క్రికెటర్లు.. విదేశీ గడ్డలపై విఫలమవుతున్నారని పేర్కొన్నారు. ఇంగ్లాండు అలాగే ఐర్లాండ్ గడ్డపై అభిషేక్ శర్మ ఎందుకు ఆడలేదని నిలదీశారు. దీనిపై సమాధానం చెబితే.. వాళ్లకు దండేసి దండం పెడతానని సంచలన ప్రకటన చేశారు తన్వీర్ అహ్మద్. ఈ క్రమంలో తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
బాబర్ ఆజం, అభిషేక్ శర్మలలో ఎవరు బెస్ట్ అనే చర్చ మొదలైంది. టీ20లలో స్ట్రైక్ రేట్ చూస్తే, 300 లకు పైగా అభిషేక్ శర్మ సాధిస్తాడు. అయితే, వన్డేలు, టెస్టుల్లో బాబార్ ఆజం ప్రదర్శన బాగుంటుందని క్రీడా విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. అభిషేక్ శర్మ మాత్రం టీ20ల్లో ది బెస్ట్ చెబుతున్నారు.