E-Paper
Advertisement

IND vs NZ: టీమిండియా గ్రాండ్ విక్టరీ.. కుర్రాళ్లు కుమ్మేశారుపో…

IND vs NZ: టీమిండియా గ్రాండ్ విక్టరీ.. కుర్రాళ్లు కుమ్మేశారుపో…
Advertisement

IND vs NZ: రాయపూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 109 పరుగుల లక్ష్యాన్ని 20.1 ఓవర్లలోనే చేధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో భారత్ కైవసం చేసుకుంది.

లక్ష్యం చిన్నదే కావడంతో భారత ఆటగాళ్లు ఆచితూచి బ్యాటింగ్ చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ 51 పరుగులతో చెలరేగిపోయాడు. శుభ్‌మన్‌గిల్ (40*)తో నాటౌట్‌గా నిలిచాడు. కోహ్లీ 11, ఇషాన్ కిషన్ 8 పరుగులు చేశారు. కివీస్ ఆటగాడు షిప్లే, శాంటర్న్ చెరో వికెట్ తీశారు. నామమాత్రమైన మూడో వన్డే ఈ నెల 24న ఇండోర్‌లో జరగనుంది.

Advertisement

అంతకుముందు.. టీమిండియా బౌలర్లు చెలరేగిపోయారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌‌కు చుక్కలు చూపించారు. భారత బౌలర్ల ధాటికి కివీస్ ఆటగాళ్లు తట్టుకోలేకపోయారు. 34.3 ఓవర్లలో 108 పరుగులు చేసి కుప్పకూలిపోయారు.

న్యూజిలాండ్ జట్టులో ముగ్గురు ఆటగాళ్లు మాత్రమే రెండంకెల స్కోర్‌ చేశారు. గ్లెన్ ఫిలిప్స్ (36), మైఖేల్ బ్రాస్‌వెల్ (22), మిచెల్ శాంటర్న్ (27) పరుగులు చేశారు. ష‌మీ, సిరాజ్‌కు తోడు ఆల్‌రౌండ‌ర్లు హార్ధిక్ పాండ్యా, శార్ధూల్ ఠాకూర్ వికెట్లు తీయ‌డంతో కివీస్ కష్టాల్లో పడింది. వాషింగ్టన్ సుంద‌ర్ వ‌రుస ఓవ‌ర్ల‌లో రెండు వికెట్లు తీసి కివీస్‌ను దెబ్బ‌కొట్టాడు.

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×