Varun Chakaravarthy: ఛాంపియన్ టోపీ 2025 టోర్నమెంట్ లో ( Champions Trophy 2025 Tournament ) టీమిండియా అదరగొడుతున్న సంగతి తెలిసిందే. అయితే… ఈ టోర్నమెంట్ కంటే ముందే… జరిగిన వన్డే సిరీస్ అలాగే t20 లో… అద్భుతంగా రాణించాడు వరుణ్ చక్రవర్తి. టీమిండియా మిస్టరీ స్పిన్నర్ గా… వరుణ్ చక్రవర్తి ( Varun Chakravarthy ) పాపులారిటీ దక్కించుకున్నాడు. ఈ తరుణంలోనే చివరి క్షణంలో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో భాగంగా ప్రకటించిన టీమిండియా జట్టులో స్థానం దక్కించుకున్నాడు. ఇక చాంపియన్స్ ట్రోఫీ లో అద్భుతంగా ప్రదర్శన… తన స్థానాన్ని జట్టులో పదిలం చేసుకుంటున్నాడు.
Also Read: SRH Match Tickets: రేపటి నుంచే హైదరాబాద్ మ్యాచ్ ల టికెట్లు.. జెర్సీ కూడా ఫ్రీ?
అయితే ఇలాంటి నేపథ్యంలోనే.. టీమిండియా మిస్టరీస్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. ఫాస్ట్ బౌలర్ గా మారాలనుకున్న వరుణ్ చక్రవర్తి… కీపర్ గా ఆ తర్వాత స్పిన్నర్ గా ఎలా మారాడు? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. వరుణ్ చక్రవర్తి మొదట్లో… టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడేవాడు. ఆ సమయంలో… స్కూల్ లెవెల్ జట్టులో అతనికి ఫాస్ట్ బౌలింగ్ వేసే అవకాశాలు ఇవ్వలేదట. దీంతో కీపింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాడట వరుణ్ చక్రవర్తి. దినేష్ కార్తీక్ కీపింగ్ చేసి సక్సెస్ అయిన నేపథ్యంలో… అతని బాటలో వెళ్లాలని… ముందుకు సాగాడట. ఆ సమయంలో కన్నన్ అనే వ్యక్తి… తనకు ఎంతో ట్రైనింగ్ కూడా ఇచ్చినట్లు తెలిపాడు. ఆ తర్వాత కాలేజీ కారణంగా.. క్రికెట్కు దూరం కావడం…. గాయాల బెడద ఎదురు కావడంతో… రెండు సంవత్సరాలపాటు క్రికెట్కు దూరంగా ఉన్నాడట వరుణ్ చక్రవర్తి.
Also Read: Mohammed Shami: వివాదంలో షమీ… రంజాన్ ఉపవాస వేళ డ్రింక్స్ తాగడం పై ముస్లింలు ఆగ్రహం ?
ఆ తర్వాత మళ్లీ… లెగ్స్ స్పిన్ మొదలుపెట్టాడు వరుణ్ చక్రవర్తి. అప్పుడు కూడా కన్నన్ సహాయంతో… బౌలింగ్ లో టెక్నిక్స్ నేర్చుకున్నాడు. ఆ తర్వాత… దినేష్ కార్తీక్ కు బౌలింగ్ చేసే అవకాశం వచ్చిందట వరుణ్ చక్రవర్తికి! ఈ తరుణంలోనే వరుణ్ వేసిన బంతులను మెచ్చుకున్నారట దినేష్ కార్తీక్. ఆ తర్వాత 2018 సంవత్సరంలో కేకేఆర్ నెట్ బౌలర్ గా రంగంలోకి దిగాడు వరుణ్ చక్రవర్తి. దాదాపు రెండు సంవత్సరాల పాటు నెట్ బౌలర్ గానే ఉన్నాడు. అప్పుడు టిఎన్పిఎల్ లీగ్ లో అద్భుతంగా రాణించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 టోర్నమెంట్ మెగా వేలంలో… కేకేఆర్.. వరుణ్ చక్రవర్తిని కొనుగోలు చేసింది. ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి దశా దిశా పూర్తిగా మారిపోయిన సంగతి తెలిసిందే. 2020 సమయంలో టీం ఇండియా సెలెక్ట్ అయినప్పటికీ పెద్దగా రాణించలేదు. కానీ గత ఏడాది కాలంగా.. దుమ్ము లేపుతున్నాడు వరుణ్ చక్రవర్తి. అదే సమయంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 టోర్నమెంట్లో కేకేఆర్ జట్టు ఫైనల్ చేరుకోవడంలో కూడా…. వరుణ్ చక్రవర్తి తన పాత్ర పోషించాడు. అందుకే అతని మళ్లీ రిటర్న్ చేసుకుంది కేకేఆర్ యాజమాన్యం.