E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

బాబ‌ర్ ఆజంను మెచ్చుకుంటూ పోస్టులు…దేశ ద్రోహి అంటూ విరాట్ కోహ్లీపై ట్రోలింగ్ !

బాబ‌ర్ ఆజంను మెచ్చుకుంటూ పోస్టులు…దేశ ద్రోహి అంటూ విరాట్ కోహ్లీపై ట్రోలింగ్ !
Advertisement

Virat Kohli:  పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగిన సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నమెంట్ లో భాగంగా ఫైనల్ మ్యాచ్ ఆదివారం రోజున జరిగింది. ఈ సందర్భంగా హైదరాబాద్ కింగ్స్ మెన్ వర్సెస్ పెషావర్ జల్మీ ( Peshawar Zalmi vs Hyderabad Kingsmen, Final) జట్లు ఫైనల్స్ లో తలపడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఐదు వికెట్ల తేడాతో బాబర్ ఆజం (Babar Azam)సేన ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో బాబర్ ఆజం కెప్టెన్సీ లోని పెషావర్ జల్మీ జట్టు ఛాంపియన్ గా నిలిచింది. అయితే దీనిపై విరాట్ కోహ్లీ తాజాగా స్పందించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బాబ‌ర్ ఆజం నువ్వు తోపు అంటూ విరాట్ కోహ్లీ చేసిన కామెంట్స్ వ్యాఖ్యలు వైర‌ల్ గా మారాయి. బాబ‌ర్ ఆజం రియ‌ల్ ఛాంపియ‌న్.. అందుకే పెషావ‌ర్ జ‌ల్మీ జ‌ట్టు ఛాంపియ‌న్ అయిందంటూ విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్య‌ల‌ను వైర‌ల్ చేస్తున్నారు.

Also Read: Islamabad United vs Hyderabad Kingsmen, Eliminator 2 PSLలో  మ‌రో అరాచ‌కం.. డ‌బ్బులు లేక ఆంటీల‌తో క్లీన్ చేయిస్తున్నారు, దొంగ‌ల్లా దూరేస్తున్నారు

పాకిస్తాన్ ఆట‌గాడిని మెచ్చుకున్న కింగ్ కోహ్లీ

Advertisement

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ విజేతగా పెషావర్ జల్మీ నిలిచిన నేపథ్యంలో విరాట్ కోహ్లీ స్పందించినట్లు సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ టోర్నమెంట్ లో బాబర్ ఆజం అద్భుతంగా రాణించినట్లు విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడని రచ్చ చేస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా ఫామ్ లేక సతమతమవుతున్న బాబర్ ఆజం, ఈ టోర్నమెంట్లో మాత్రం అద్భుతంగా రాణించాడని పేర్కొన్నారు విరాట్ కోహ్లీ. దాని ఫలితంగానే ఇప్పుడు టోర్నమెంట్ విజేతగా బాబర్ ఆజం సేన నిలిచిందన్నారు. ఇదే ఊపుతో ముందుకు వెళితే పాకిస్తాన్ కెప్టెన్సీ బాధ్యతలు కూడా బాబర్ ఆజంకు అప్పగించాలని కూడా డిమాండ్ చేశాడని విరాట్ కోహ్లీకి సంబంధించిన పోస్టును వైరల్ చేస్తున్నారు. అయితే అధికారికంగా విరాట్ కోహ్లీ ఎక్కడ పోస్ట్ పెట్టినట్లు దాఖలాలు కనిపించడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ప్రచారం అయితే జోరుగా సాగుతోంది.

దీనిపై ఇండియన్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. పాకిస్తాన్ దేశానికి సంబంధించిన బాబర్ ఆజం ను విరాట్ కోహ్లీ మెచ్చుకోవడం దారుణమని ఫైర్ అవుతున్నారు. లండన్ లో సెటిల్ అయిన విరాట్ కోహ్లీని దేశద్రోహి అంటూ పోస్టులు కూడా పెడుతున్నారు. బిసిసిఐ ఇచ్చిన డబ్బులతో ఎదిగిన విరాట్ కోహ్లీ… ఇండియాకు అన్యాయం చేసి లండన్ లో సెటిల్ అయ్యాడని మండిపడుతున్నారు. ఇప్పుడు ప్రత్యర్థి పాకిస్తాన్ వాడిని మెచ్చుకుంటూ విరాట్ కోహ్లీ ఎందుకు ఇలా పోస్టులు పెట్టాడని నిలదీస్తున్నారు. అయితే విరాట్ కోహ్లీ అభిమానులు మాత్రం ఇదంతా ఫేక్ అని కొట్టి పారేస్తున్నారు. ఫేక్ ఖాతా ద్వారా విరాట్ కోహ్లీ పేరుతో కొంతమంది దుర్మార్గులు బాబర్ ఆజంను మెచ్చుకున్నట్లు పోస్టులు పెట్టారని అంటున్నారు.

Advertisement

Also Read: Babar Azam retain captaincyRamiz Raja Hug: కామెంట్రీలో చేస్తుండ‌గా రొమాన్స్‌..రమీజ్ రాజా, లీసా హాట్ వీడియో వైర‌ల్ 

 

?igsh=bjJoeWdhODhvMmMx

Related News

పాకిస్తాన్ మ‌హిళ‌లకు క్రికెట్ చేత‌కాదు కానీ, వంట‌లు మాత్రం బాగా చేస్తారు

Pollard Vs Milind: పొలార్డ్ కే సినిమా చూపించిన మిలింద్..బిత్త‌ర‌పోయిన అంపైర్లు

వరల్డ్ కప్ లో 33 యాడ్స్.. కానీ చేసింది 32 పరుగులే, జెమిమాను తీసేయండి అంటూ ట్రోల్స్‌

మ‌ళ్లీ వైభ‌వ్ కాల‌ర్లు ప‌ట్టుకుంటాడ‌ని భ‌యంతో శ్రీలంక బౌల‌ర్లు స్లోగా బంతులు వేశారు !

15 ఏళ్ల వ‌య‌స్సులో నాకు బ్యాట్ స‌రిగ్గా పట్టుకోలేకపోయేవాడిని..కానీ వైభ‌వ్ మాత్రం !

Sanjay Manjrekar: వైభ‌వ్ ను చూస్తే వ‌ణుకుపుడుతోంది..లంక ప్లేయ‌ర్లకు న‌ర‌కం చూపించాడు

వైభ‌వ్ మాములోడు కాదు, 8వ‌ వండ‌ర్..ఆ బ్యాటింగ్ చూసి పిచ్చోడిని అయిపోయా

IND VS SL : ‘ఇదెక్కడి మాస్ రా మామ’…టీమిండియా ప్రొజెక్టెడ్ స్కోర్ 910 అంటూ పోస్టులు

Big Stories

×