Jemimah Rodrigues: టి20 మహిళల ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ (ICC Women’s T20 World Cup 2026 ) నేపథ్యంలో టీమిండియాకు తొలి పరాభవం ఎదురయింది. బలమైన దక్షిణాఫ్రికా చేతిలో నిన్న టీమిండియా దారుణంగా ఓడిపోయింది. మాంచెస్టర్ లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్ (Emirates Old Trafford, Manchester) వేదికగా దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మహిళల (South Africa Women vs India Women, 18th Match) జట్ల మధ్య 18 వ మ్యాచ్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో విక్టరీ నమోదు చేసుకుంది. అయితే, ఈ మ్యాచ్ లో కూడా విఫలమైన జెమిమా రోడ్రిగ్స్ ( Jemimah Rodrigues)పై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు జనాలు. వరల్డ్ కప్ ప్రారంభం కాగానే ఆమె దాదాపు 33 యాడ్స్ చేసిందని… కానీ ఈ వరల్డ్ కప్ లో ఇప్పటి వరకు 32 పరుగులు మాత్రమే సాధించడం దారుణమని జెమిమా రోడ్రిగ్స్ ను ఉద్దేశించి మండిపడుతున్నారు. ఇలాంటి టెస్ట్ ప్లేయర్ ను ఎందుకు తీసుకున్నారని బీసీసీఐని నిలదీస్తున్నారు క్రికెట్ అభిమానులు. వెంటనే వరల్డ్ కప్ నుంచి ఆమెను తొలగించి, కొత్త ప్లేయర్ ను తుది జట్టులోకి తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
టీ20 మహిళల ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్లో భాగంగా నిన్న దక్షిణాఫ్రికా వర్సెస్ టీమిండియా మహిళల జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో టీమిండియా మొదట బ్యాటింగ్ చేసి 158 పరుగులు సాధించింది. ఇక ఈ లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో చేదించింది దక్షిణాఫ్రికా. దీంతో టీమిండియా పై ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది దక్షిణాఫ్రికా. అయితే ఈ ఓటమి నేపథ్యంలో జమీమా పైన దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు క్రికెట్ అభిమానులు. జెమిమా టెస్ట్ ప్లేయర్ అని.. అలాంటి వాళ్లను టీ20లకు ఎందుకు సెలెక్ట్ చేశారని మండిపడుతున్నారు. జెమిమా రోడ్రిగ్స్ ( Jemimah Rodrigues) స్థానంలో మరొక ప్లేయర్ ను తీసుకుంటే సరిపోయేదని అంటున్నారు.
ఈ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు కేవలం 32 పరుగులు మాత్రమే చేసింది జమీమా. కీలకమైన పాకిస్తాన్ మ్యాచ్ లో ఒకే ఒక్క పరుగు చేసిన జెమిమా రోడ్రిగ్స్ , నెదర్లాండ్స్ పైన 19 పరుగులతో చెత్త ప్రదర్శన కనబరిచింది. నిన్న దక్షిణాఫ్రికా పైన 12 పరుగులు మాత్రమే చేసింది. కనీసం 30 పరుగులు చేసినా, నిన్న దక్షిణాఫ్రికా పై టీమ్ ఇండియా గెలిచేది. దీంతో జెమిమా రోడ్రిగ్స్ ను ఆడుకుంటున్నారు. అంతేకాదు ఈ వరల్డ్ కప్ సమయంలో 33 యాడ్స్ లో పాల్గొన్న ఆమె, 33 పరుగులు కూడా చేయలేకపోయిందని ఆగ్రహిస్తున్నారు.