BigTV English

Telangana : పండుగ వేళ పుట్టెడు దుఃఖం.. వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి

Telangana : పండుగ వేళ పుట్టెడు దుఃఖం.. వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి

Telangana : సంక్రాంతి పండుగ శోభ మొదలైంది. పట్టణాలు పల్లెబాట పట్టాయి. ఊరూరా భోగి, సంక్రాంతి వేడుకలకు సిద్ధమవుతున్న వేళ.. ఊహించని రోడ్డు ప్రమాదాలు కొన్ని కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. తెలంగాణలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు.


సైకిల్ ని బైక్ వేగంగా ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామ శివారులోని రోడ్డుపై జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నిఖిల్ రెడ్డి (25) అనే యువకుడు తన స్నేహితుడు సుమంత్ తో కలిసి బైక్ పై వేగంగా వెళ్తుండగా సైకిల్ పై ఉన్న వెంకట్ (43) అనే వ్యక్తిని ఢీ కొట్టాడు. దాంతో వెంకట్ , నిఖిల్ అక్కడికక్కడే మృతి చెందారు. సుమంత్ కు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన సుమంత్ ను కామారెడ్డి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ములుగు జిల్లా తాడ్వాయి మండలం నాపల్లిలో జరిగిన మరో రోడ్డుప్రమాదంలో నలుగురు మృతి చెందారు. బైక్ వెళ్తూ.. ప్రమాదవశాత్తు చెట్టును ఢీ కొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు. మృతులు హనుమకొండ జిల్లాలోని పత్తిపాకకు చెందిన పోతుగంటి వంశీ(23), ఎల్తూరి పవన్(22) గా గుర్తించారు. పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కు తరలించారు.


Related News

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Big Stories

×