BigTV English

Telangana IPS Transfers: తెలంగాణలో ఐదుగురు ఐపీఎస్​ల బదిలీ.. హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్

Telangana IPS Transfers: తెలంగాణలో ఐదుగురు ఐపీఎస్​ల బదిలీ.. హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్

Telangana IPS Transfers : తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్ నియమితులయ్యారు. విజిలెన్స్ డీజీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, ఏసీబీ డీజీగా విజయ్ కుమార్‌‌ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.


రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో ఐదుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. అవినీతి నిరోధక శాఖ డీజీగా ఉన్న సీవీ ఆనంద్‌ను తిరిగి హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా నియమించింది. అంతే కాకుండా హైదరాబాద్ కొత్వాల్‌గా ఉన్న కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్ మెంట్‌కు బదిలీ చేసింది. పోలీస్ పర్సనల్‌గా అదనపు డీజీగా మహేష్ భగవత్‌ను హైదరాబాద్ అదనపు డైరెక్టర్ జనరల్ పోలీస్‌గా నియమించారు.

Also Read: బస్సు ఆపి పారిపోయిన యువకుడు.. సజ్జనార్ ట్వీట్


ఏసీబీ డీజీగా విజయ్ కుమార్ నియమితులు అయ్యారు. అంతే కాకుండా ఇన్స్ పెక్టర్ జనరల్ పోలీస్‌గా  ఉన్న రమేష్‌ను ప్రొవిజింగ్‌తో పాటు హైదరాబాద్ ఇన్ స్పెక్టర్ జనరల్ పోలీస్ స్పోర్ట్స్ బాధ్యతలను అప్పగించారు. వెంటనే బాధ్యతలు స్వీకరించాలని సీఎస్ శాంత కుమారి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×