E-Paper
Advertisement

Telangana IPS Transfers: తెలంగాణలో ఐదుగురు ఐపీఎస్​ల బదిలీ.. హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్

Telangana IPS Transfers: తెలంగాణలో ఐదుగురు ఐపీఎస్​ల బదిలీ.. హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్

Telangana IPS Transfers : తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్ నియమితులయ్యారు. విజిలెన్స్ డీజీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, ఏసీబీ డీజీగా విజయ్ కుమార్‌‌ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో ఐదుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. అవినీతి నిరోధక శాఖ డీజీగా ఉన్న సీవీ ఆనంద్‌ను తిరిగి హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా నియమించింది. అంతే కాకుండా హైదరాబాద్ కొత్వాల్‌గా ఉన్న కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్ మెంట్‌కు బదిలీ చేసింది. పోలీస్ పర్సనల్‌గా అదనపు డీజీగా మహేష్ భగవత్‌ను హైదరాబాద్ అదనపు డైరెక్టర్ జనరల్ పోలీస్‌గా నియమించారు.

Also Read: బస్సు ఆపి పారిపోయిన యువకుడు.. సజ్జనార్ ట్వీట్

ఏసీబీ డీజీగా విజయ్ కుమార్ నియమితులు అయ్యారు. అంతే కాకుండా ఇన్స్ పెక్టర్ జనరల్ పోలీస్‌గా  ఉన్న రమేష్‌ను ప్రొవిజింగ్‌తో పాటు హైదరాబాద్ ఇన్ స్పెక్టర్ జనరల్ పోలీస్ స్పోర్ట్స్ బాధ్యతలను అప్పగించారు. వెంటనే బాధ్యతలు స్వీకరించాలని సీఎస్ శాంత కుమారి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Related News

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

Big Stories

×