ACB Raids: స్వేచ్ఛ బ్యూరో: సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సర్ప్రైజ్ విజిట్ నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల సర్ప్రైజ్ సోదాలు నిర్వహించారు. మున్సిపల్ మేనేజర్ ఇంటికి ఏసీబీ అధికారులు వెళ్లిన సమయంలో ఇంటికి తాళం వేసి ఉన్నట్లు అధికారులు గమనించారు.
మున్సిపల్ కమిషనర్ ఇంటిలో సైతం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో సుమారు 20 మంది బృందంతో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఏసీబీ అధికారులు సర్ప్రైజ్ విజిట్ అని పేర్కొన్నప్పటికీ, ఫిర్యాదు లేకుండా సోదాలు నిర్వహించరనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also read: పెళ్లిపీటలెక్కిన బిగ్ బాస్ ప్రియాంక..ఇలా షాక్ ఇచ్చేందేంటి భయ్యా!
ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయం, మేనేజర్, కమిషనర్ ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు ప్రారంభించారు. ఇప్పటివరకు అధికారులు గోప్యంగా సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: ORR Accidents: కంట్రోల్ తప్పితే కైలాసమే.. ఈ రోడ్లపై ప్రతి నాలుగు రోజులకు ఒకరు బలి..?