E-Paper
Advertisement

Telangana : బతికుండగానే శ్మశానానికి.. ఘోరం

Telangana : బతికుండగానే శ్మశానానికి.. ఘోరం
Advertisement

Telangana : పాపం.. ఘోరం.. దారుణం. బతికుండగానే శ్మశానానికి తరలించిన ఘటన. పేదరికం ఎంత దుర్మార్గమైనదో చెప్పడానికి ఇదే ఉదాహరణ. సొంత ఇల్లు లేకపోవడం ఎంతటి చేదు అనుభవాన్ని చూపిస్తుందో చెప్పే దుర్ఘటన. తెలంగాణ, జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఈ హృదయవిదారక విషయం చోటుచేసుకుంది. ఆరోగ్యం విషమించిన ఓ వ్యక్తిని బతికుండగానే శ్మశానానికి తరలించిన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ప్రాణాలతోనే శ్మశానానికి..

Advertisement

ధర్మపురికి చెందిన రంగు గోపి అనే యువకుడు తన చెల్లితో కలిసి హోటల్ నడుపుతున్నాడు. అనుకోకుండా అనారోగ్యానికి గురయ్యాడు. ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్‌ పొందుతున్నాడు. చికిత్స ఫలించక ఆయన పరిస్థితి విషమించింది. వైద్యులు ఇక లాభం లేదని.. ఇంటికి తీసుకెళ్లమని చెప్పారు. అయితే, గోపికి సొంత ఇల్లు అంటూ ఏదీ లేదు. అద్దె ఇంట్లో ఉంటున్నాడు. అదే ఇంటికి అతన్ని తీసుకెళ్లారు. కానీ, ఇంట్లోకి రానివ్వడానికి ఆ హౌజ్ ఓనర్ ఒప్పుకోలేదు. చనిపోతే తన ఇంటికి అరిష్టమని.. ఇక్కడి నుంచి ఎక్కడికైనా తీసుకెళ్లిపోండని బెదిరించాడు. ఎక్కడికని పోతారు? అంత దగ్గరి బంధువులు కూడా ఎవరూ లేరు. ఉన్నా వాళ్లు కూడా రానివ్వరు. ఏం చేయాలో తెలీలేదు వాళ్లకు. ఎలాగూ చనిపోతాడని డాక్టర్లు చెప్పారు. ఇవాళో రేపో అంటున్నారు కదాని.. గత్యంతరం లేక.. బతికుండగానే గోపిని శ్మశానానికి తరలించారు కుటుంబ సభ్యులు.

కాపు కాశారు..

Advertisement

శ్మశానంలో వారి దీనస్థితిని చూసి మున్నూరు కాపు సంఘ సభ్యులు స్పందించారు. వారి కమ్యూనిటీ బిల్డింగ్‌లో ఉండేందుకు అనుమతించారు. గోపిని ప్రస్తుతం కాపు భవనంలో ఉంచారు. విషయం తెలిసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తన వంతు సాయంగా రూ.10వేలు స్థానిక నాయకుల ద్వారా అందజేశారు. సొంత ఇల్లు లేక ఇబ్బందుల్లో ఉన్న ఆ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇందిరమ్మ ఇల్లు అయినా ఇప్పించాలని వేడుకుంటున్నారు.

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×