E-Paper
Advertisement

Mayor : మేయర్ పీఠంపై అన్ని పార్టీల గురి.. ఎవరికి చిక్కెనో!

Mayor : మేయర్ పీఠంపై అన్ని పార్టీల గురి.. ఎవరికి చిక్కెనో!

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి.ఫలితాలు సైతం వెలువడ్డాయి. సుమారు 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో అధికార కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకున్నది. మొత్తంగా ఎన్నికలు పూర్తవ్వడంతో తదుపరి ప్రక్రియ మేయర్, చైర్మన్‌ల ఎంపికపై అన్ని పార్టీలు ఫోకస్ పెట్టాయి. కాంగ్రెస్ పార్టీ 7 కార్పొరేషన్లను కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తుండగా.. కరీంనగర్ మేయర్ పీఠంపై తీవ్ర సస్పెన్స్ నెలకొన్నది. అక్కడ బీజేపీకి మెజార్టీ రాగా.. నలుగురు స్వతంత్ర అభ్యర్థులతో కలిసి మేయర్ పీఠం దక్కించుకోవాలని బీజేపీ చూస్తున్నది. ఇక మిగతా ఆరు కార్పొరేషన్లలో మూడింటిలో కాంగ్రెస్ పార్టీ నేరుగా మేయర్ స్థానాలను కైవసం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నది. మరో మూడింటిలో మాత్రం మిత్రపక్షాలతో కలిసి సీట్ షేరింగ్ కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

కాంగ్రెస్‌కే చాన్స్..

రాష్ట్రంలో ప్రస్తుతం మేయర్ పీఠాలను ఏ పార్టీ కైవసం చేసుకోబోతున్నది అనే దానిపై తీవ్ర చర్చ జరుగుతున్నది. అధికార కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటిన విషయం తెలిసిందే. నల్గొండ, మహబూబ్ నగర్, రామగుండం మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. సోమవారం మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. ఇక కొత్తగూడెం కార్పొరేషన్‌లో సీపీఐ.. నిజామాబాద్‌ కార్పొరేషన్లో ఎంఐఎం పార్టీ మద్దతుతో పాలకవర్గాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నది. చెరో రెండున్నరేండ్లు మేయర్ పదవులను మార్చుకునేలా ఒప్పందం చేసుకోబోతున్నారని చర్చ జరుగుతున్నది.ఇదే విషయంపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సీపీఐతో చర్చలు జరపగా.. ఎంఐఎంతో త్వరలోనే చర్చలు జరపనున్నట్టు సమాచారం.

కరీంనగర్‌పై వీడని సస్పెన్స్..

కరీంనగర్ మేయర్ పీఠంపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతున్నది. మొత్తం 66 కార్పొరేటర్ స్థానాలు ఉండగా.. 30 వరకు బీజేపీ గెలుచుకున్నది. మిగతా నాలుగు నుంచి ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులతో కలిసి మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలను పొందాలని బీజేపీ చూస్తున్నది. ఇప్పటికే నలుగురు స్వతంత్రులు బీజేపీలో చేరారు. అయితే, అందులో నుంచి ఇద్దరు స్వతంత్రులు బీజేపీ హ్యాండ్ ఇచ్చి అధికార పార్టీతో టచ్ లోకి వెళ్లినట్టు తెలుస్తున్నది. వీరితో పాటు ఎంఐఎం మద్దతు తీసుకుంటే కరీంనగర్ లోనూ కాంగ్రెస్ పాలక వర్గాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నది.మరి కరీంనగర్ పీఠాన్ని బీజేపీ కైవసం ? కాంగ్రెస్ కైవలం చేసుకుంటుందా? అనేది రేపు తెలియనుంది. నిజామాబాద్, కరీంనగర్‌లో బీజేపీ పార్టీ మెజార్టీ స్థానాలు సాధించినా ఆ పార్టీకి మేయర్ పీఠం దక్కుతుందా? లేదా? అనేది సస్పెన్స్‌గా మారింది.

Congress Victory: రాష్ట్ర రాజకీయాలపై ఢిల్లీలో చర్చ.. రేవంత్ రెడ్డికి ప్రియాంక గాంధీ ప్రత్యేక అభినందనలు

బీఆర్ఎస్‌కు జీరో..

మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క కార్పొరేషన్‌లోనూ సత్తా చాటలేకపోయింది. కేవలం మున్సిపాలిటీల్లో మాత్రమే సత్తా చాటింది. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అన్నిమున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో సత్తా చాటిన గులాబీ పార్టీ ఈసారి మాత్రం కేవలం మున్సిపాలిటీల్లోనే ప్రభావం చూపింది. కార్పొరేషన్ ఎన్నికల్లో అతి తక్కువ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బీఆర్ఎస్ 15కు పైగా మున్సిపాలిటీల్లో సత్తా చాటగా.. కాంగ్రెస్ 50కు పైగా మున్సిపాలిటీలు కైవసం చేసుకుంది. మిగతా 34 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. ఈ స్థానాల్లో అధికార మార్పిడి ముఖ్యంగా బీఆర్ఎస్, బీజేపీ మధ్యే ఉంటుందని తెలుస్తోంది. కాంగ్రెస్ తన మిత్రపక్షమైన ఎంఐఎం, సీపీఐ పార్టీలతో కలిసి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ స్థానాలను కైవసం చేసుకునే చాన్స్ ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Related News

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

Big Stories

×