E-Paper
Advertisement

National Herald Case : మళ్లీ తెరపైకి నేషనల్ హెరాల్డ్ కేసు.. ఈడీ విచారణకు అంజన్ కుమార్ యాదవ్

National Herald Case : మళ్లీ తెరపైకి నేషనల్ హెరాల్డ్ కేసు.. ఈడీ విచారణకు అంజన్ కుమార్ యాదవ్

National Herald Case : నేషనల్ హెరాల్డ్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసులో సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఈడీ విచారణకు హాజరయ్యారు.యంగ్ ఇండియా లిమిటెడ్ కు ఇచ్చిన విరాళాలపై అంజన్ కుమార్ స్టేట్ మెంట్ ను ఈడీ అధికారులు రికార్డ్ చేస్తున్నారు.

యంగ్ ఇండియన్‌ ఫౌండేషన్‌ అనే ఛారిటీ సంస్థకు గతంలో అంజన్ కుమార్ యాదవ్ రూ. 20 లక్షలు విరాళం ఇచ్చారు. ఈ మెుత్తం ఎక్కడిదనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. పీఎంఎల్ఏ చట్టం సెక్షన్ 50ఏ ప్రకారం అంజన్ కుమార్ యాదవ్ ను ఈడీ ప్రశ్నిస్తోంది. అక్టోబర్ 3న అంజన్ కుమార్ యాదవ్ విచారణకు రావాల్సి ఉండగా.. అనారోగ్యం కారణంగా హాజరు కాలేదు.

నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికే సోనియా గాంధీ,రాహుల్ గాంధీని ఈడీ విచారించింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతోపాటు పలువురు కాంగ్రెస్ నేతలను ఈడీ అధికారులు ప్రశ్నించారు.మనీ లాండరింగ్ ఆరోపణలు రావడంతో ఈ కేసును ఈడీ దర్యాప్తు చేస్తోంది. జూన్‌లో వరుసగా మూడు రోజులపాటు ఢిల్లీలో జరిగిన విచారణకు సోనియాగాంధీ హాజరయ్యారు.అప్పట్లో 70కి పైగా ప్రశ్నలను ఈడీ అధికారులు సంధించారు. ఈడీ ప్రశ్నలకు సోనియాగాంధీ సరైన సమాధానం ఇచ్చారని కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేశాయి. ఆ తర్వాత రాహుల్ గాంధీని ఈడీ అధికారులు సుధీర్ఘంగా ప్రశ్నించారు. ఇప్పుడు మళ్లీ ఈ కేసు విచారణను ఈడీ చేపట్టింది.

    Related News

    ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

    Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

    Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

    తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

    ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

    మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

    Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

    జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

    Big Stories

    ×