E-Paper
Advertisement

BRS Party: కాంగ్రెస్, బీజేపీలకు షాక్.. బెల్లంపల్లి మున్సిపాలిటీలో అనూహ్య మలుపు.. బీఆర్ఎస్ గూటికి కౌన్సిలర్లు!

BRS Party: కాంగ్రెస్, బీజేపీలకు షాక్.. బెల్లంపల్లి మున్సిపాలిటీలో అనూహ్య మలుపు.. బీఆర్ఎస్ గూటికి కౌన్సిలర్లు!

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఊహించని పరిణామాల మధ్య బెల్లంపల్లి మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకునే దిశగా బీఆర్ఎస్ అడుగులు వేస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఇతర పార్టీలకు చెందిన పలువురు కౌన్సిలర్లు గులాబీ కండువా కప్పుకోవడంతో బెల్లంపల్లి రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఇప్పటికే మున్సిపాలిటీలో బలంగా ఉన్న బీఆర్ఎస్, తాజా చేరికలతో తిరుగులేని శక్తిగా అవతరించింది.

కేటీఆర్ సమక్షంలో చేరికలు..

హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మున్సిపాలిటీకి చెందిన కీలక కౌన్సిలర్లు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 26వ వార్డు కౌన్సిలర్ ఇప్ప కుమారస్వామి, 28వ వార్డు కౌన్సిలర్ చిప్ప అర్చన కాంగ్రెస్ పార్టీని వీడి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. వీరితో పాటు 30వ వార్డు స్వతంత్ర కౌన్సిలర్ సుకేశిని భరద్వాజ్ కూడా గులాబీ గూటికి చేరారు. వీరికి కేటీఆర్ స్వయంగా పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

మద్దతు తెలిపిన బీజేపీ కౌన్సిలర్..

మరోవైపు, 34వ వార్డుకు చెందిన బీజేపీ కౌన్సిలర్ కొక్కుల రామూర్తి కూడా కేటీఆర్‌ను కలిసి తన సంపూర్ణ మద్దతును ప్రకటించడం విశేషం. అంతేకాకుండా, 32వ వార్డుకు చెందిన కాంగ్రెస్ అభ్యర్థి హారిక కూడా బీఆర్ఎస్ నాయకత్వంతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఆమె కూడా త్వరలోనే అధికారికంగా పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అభివృద్ధి పనులకు ఆకర్షితులయ్యే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు చేరుతున్న నేతలు పేర్కొంటున్నారు.

మేజిక్ ఫిగర్ దాటిన బలం..

బెల్లంపల్లి మున్సిపాలిటీలో గత ఎన్నికల ఫలితాల ప్రకారం బీఆర్ఎస్ ఇప్పటికే 14 స్థానాల్లో విజయం సాధించి ముందంజలో ఉంది. తాజా చేరికలు, బీజేపీ కౌన్సిలర్ మద్దతు మరియు లైన్‌లో ఉన్న ఇతర అభ్యర్థులను పరిగణనలోకి తీసుకుంటే, బీఆర్ఎస్ బలం ఇప్పుడు ఏకంగా 20కి చేరుకుంది. దీనితో బెల్లంపల్లి మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి కావాల్సిన పూర్తి మెజారిటీని బీఆర్ఎస్ సాధించినట్లయింది. సంపూర్ణ బలం చేకూరడంతో మున్సిపల్ చైర్మన్ పీఠంపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

ఈ పరిణామం బెల్లంపల్లిలో ప్రతిపక్షాలకు కోలుకోలేని దెబ్బగా మారింది. కేటీఆర్ నాయకత్వంలో బెల్లంపల్లి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని చేరిన నేతలు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. స్థానికంగా ఈ మార్పులు బెల్లంపల్లి రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి తెరలేపాయి.

ALSO READ: Divvela Madhuri: దువ్వాడ శ్రీనివాస్ తో మాధురి పెళ్లి.. ఆమె భర్త రియాక్షన్ ఇదే?

Related News

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

Big Stories

×