E-Paper
Advertisement

MP Laxman Comments: దర్యాప్తు జరపాలి.. ఫోన్ ట్యాపింగ్‌ ఇష్యూ.. వారిని వదలొద్దు..!

MP Laxman Comments: దర్యాప్తు జరపాలి..  ఫోన్ ట్యాపింగ్‌ ఇష్యూ.. వారిని వదలొద్దు..!
Advertisement

BJP MP Laxman Comments On Phone Tapping Case issue

MP Laxman Comments: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రాజకీయ రచ్చ కొనసాగుతోంది. దీనిపై బీజేపీ కూడా స్పందించింది. ఫోన్ ట్యాపింగ్‌ సూత్రదారులపై పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్.

Advertisement

హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఎంపీ లక్ష్మణ్.. అసెంబ్లీ ఎన్నికల్లో నేతల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టు వచ్చిన ఆరోపణలను గుర్తు చేశారు. దుబ్బాక, మనుగోడు, హుజూరాబాద్ ఉపఎన్నికల్లోనూ ట్యాపింగ్ అంశంపై అప్పుడే చర్చ జరిగిందన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో అసలు దోషులను వదిలిపెట్టవద్దన్నారు ఎంపీ.

బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లపాటు ఫోన్ ట్యాపింగ్ చేసిందని గుర్తుచేశారు. అప్పట్లో దీనిపై గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశామని వెల్లడించారు ఎంపీ లక్ష్మణ్. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని గవర్నర్‌ను కోరుతామన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే కచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ అంశంపై విచారణ జరిపి నిందితులను అరెస్ట్ చేయాలన్నారు.

Advertisement

ALSO READ: ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ.. హీరోయిన్‌తో ఎలాంటి..?

మరోవైపు కాంగ్రెస్-బీఆర్ఎస్ ఒక్కటేనని ఆరోపించారు ఎంపీ లక్ష్మణ్. ఎన్నికలు వచ్చినప్పుడే పరస్పరం విమర్శలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు తామే గెలుస్తామని ధీమా వ్యక్తంచేశారు. కవితను అరెస్ట్ చేయకపోతే బీజేపీ-బీఆర్ఎస్ ఒక్కటేనని ప్రచారం చేశారని దుయ్యబట్టారు లక్ష్మణ్. విచారణ సంస్థలు ఆమెని అరెస్ట్ చేశాయని గుర్తు చేశారు.

 

Tags

Related News

మీర్‌పేట్‌లో అర్ధరాత్రి దారుణం.. బర్త్‌డే వేడుకలకు పిలిచి రౌడీషీటర్ దారుణ హత్య

GHMC ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు.. నోటిఫికేషన్‌కు తాత్కాలిక బ్రేక్!

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక ప్రకటన.. వరంగల్ ఎయిర్‌పోర్టు నిధులు, టెండర్లు ఆహ్వానంపై

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Big Stories

Advertisement
×