E-Paper
Advertisement

Fee Reimbursement Scheme: అప్పటి వరకు కాలేజీల బంద్ కొనసాగుతుంది.. ప్రైవేట్ కాలేజీల అసోసియేషన్ కీలక ప్రకటన

Fee Reimbursement Scheme: అప్పటి వరకు కాలేజీల బంద్ కొనసాగుతుంది.. ప్రైవేట్ కాలేజీల అసోసియేషన్ కీలక ప్రకటన
Advertisement

Fee Reimbursement Scheme: తెలంగాణలో ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిల వివాదం కొనసాగుతున్న వేళ తెలంగాణ ప్రైవేట్ కాలేజీల అసోసియేషన్ ప్రెసిడెంట్ రమేష్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం తమను చర్చలకు పిలిచినట్లు తెలిపారు.

తమ డిమాండ్లను పరిష్కరించేవరకు బంద్ కొనసాగిస్తామని రమేష్ బాబు స్పష్టం చేశారు. జేఎన్టీయూ, ఉస్మానియా పరిధిలో నిర్వహిస్తున్న పరీక్షలను ప్రైవేట్ కాలేజీలు బహిష్కరించాయని తెలిపారు. కళాశాల విద్యా శాఖ కమీషనర్ దేవసేనను వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ఆమె తమను ఎంత వేధిస్తున్నా భరిస్తున్నామని అన్నారు. ఎల్బీ స్టేడియంలో ఈ నెల 8న 70 వేల ప్రైవేట్ అధ్యాపకులతో భారీ సభ నిర్వహిస్తామని తెలిపారు.

Advertisement

Read Also: Heavy Rain Alert: రెయిన్ అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో పిడుగులతో కూడిన వర్షం.. బయటకు వచ్చారో ముంచేస్తుంది..

ఫీజు రియింబర్స్‌మెంట్ సమస్యల పరిష్కారినికి వేసిన కమిటీని అహ్వానిస్తున్నామని, అయితే మూడు నెలలు కాకుండా నెల రోజుల్లోనే నివేదిక ఇచ్చేలా చూడాలన్నారు. మర్చి నాటికి బకాయిలు చెల్లించాలని రమేష్ బాబు కోరారు. కాలేజీలపై విజిలెన్స్ దాడులను ఖండిస్తున్నామని చెప్పారు. తమ డిమాండ్లు పరిష్కారం కాకపోతే 10 లక్షల మంది విద్యార్థులతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని హెచ్చరించారు.

Advertisement

దీపావళి నాటికి రూ. 1200 కోట్లు విడుదల చేస్తామని గతంలో హామీ ఇచ్చిన ప్రభుత్వం, ఇప్పటివరకు కేవలం రూ. 360 కోట్లు మాత్రమే విడుదల చేసిందని వారు మండిపడ్డారు. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద సుమారు రూ. 10 వేల కోట్ల ఫీజు రియంబర్స్‌మెంట్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ వైఖరికి నిరసనగా, నవంబర్ 3వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు కళాశాలలను బంద్ చేసి యజామాన్యాలు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నాయి.

 

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×