Nizamabad BJP: నిజామాబాద్ అర్బన్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అనుకున్న అంచనాలు తలకిందులు అయ్యయట. ఇప్పటి వరకు మేయర్ పీఠం బీజేపీ దే అనే భావనలో ఉన్న బీజేపీ పార్టీ ఇప్పుడు ఎవరు ఐతే మేయర్ అభ్యర్థి అనుకుంటున్నారో వారి స్థానం లో లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ తో గెలిచే అవకాశం లేదంటూ జరుగుతున్న ప్రచారానికి బీజేపీ పార్టీ రూటు మార్చారు. గతంలో బీజేపీ పార్టీ నుంచి ఫ్లోర్ లీడర్ గా పని చేసిన ఆ అభ్యర్థి ఇప్పుడు స్థాన చలనం మారడంతో ఓటమికి చాలా దగ్గరలో ఉందని బీజేపీ సర్వేలో తేలిందని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే బీజేపీ లో టికెట్ ఆశించిన వారికి టికెట్ రాకపోవడంతో సోషల్ మీడియాలో బీజేపీ కార్యకర్తలు పెడుతున్న మేసేజ్ లు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీసింది.
Also Read:Social Media: ఏంటీ బ్రో.. సోషల్ మీడియాలో అడ్డమైన పోస్టులు పెడుతున్నారా? SMAS వస్తోంది జాగ్రత్త!
ఇక రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన మేయర్ పీఠం ఒక పక్క బీజేపీ మన ఇందూరు మన మేయర్ అంటూ ముందుకు సాగుతుంటే కాంగ్రెస్ పార్టీ పేరు మార్పుతో అభివృద్ది జరగదు అంటూ అధికారంలో ఉన్న పార్టీకి ఓటు వేస్తేనే అభివృద్ధి జరుగుతుంది అంటూ చెప్పుకొస్తున్నారు. ఇలా బీజేపీ పీఠం పై కొత్తగా టికెట్ లా మార్పు వల్లనే బీజేపీ పై ఉన్న నమ్మకం పోయిందని పైగా నిన్న మొన్న కాంగ్రెస్, బీ ఆర్ ఎస్ లో అన్న నాయకులకు టికెట్ ఇవ్వడంతో వ్యతిరేక స్వరాలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ముందు నుంచి అనుకుంటున్న బీజేపీ మేయర్ అభ్యర్థి పేరు మార్పుతో ఒక్కసారిగా జిల్లాలో బిజెపి పార్టీలో మరో పేరు పంపించినట్లు విశ్వాసనీయ సమాచారంతో నిజామాబాద్ కార్పొరేషన్ లో చర్చనీయాంశంగా మారింది.
Also Read: KTR: తులం బంగారం ఏమైంది..? రేవంత్ సర్కార్పై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్, కాంగ్రెస్ శ్రేణులు ఫైర్