E-Paper
Advertisement

BRS MLAs Protested in Assembly: కాంగ్రెస్‌ వైఖరిపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఆగ్రహం.. శాసనసభ ప్రాంగణంలో నిరసన..

BRS MLAs Protested in Assembly: కాంగ్రెస్‌ వైఖరిపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఆగ్రహం.. శాసనసభ ప్రాంగణంలో నిరసన..
Advertisement
BRS leaders Protested in Assembly

BRS leaders Protested in Assembly(Latest political news Telangana): తెలంగాణ శాసనసభలో అధికార కాంగ్రెస్‌కు, ప్రతిపక్ష బీఆర్ఎస్‌కు వాగ్వాదం చోటు చేసుకుంది. అసెంబ్లీలో కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ బీఆర్‌ఎస్ సభ్యులు బయటకు వచ్చారు. కేసీఆర్ నల్గొం సభలో చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి బాష పైన బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. సభ నుంచి వాకౌట్ చేశారు.

అనంతరం మీడియా పాయింట్‌ వద్దకు వెళ్తుండగా పోలీసులు, మార్షల్స్‌ వారిని అడ్డుకోవడంతో భారాస ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేసి.. వారితో వాగ్వాదానికి దిగారు. సభ జరుగుతున్నప్పుడు మీడియా పాయింట్‌ వద్దకు అనుమతులు ఉండవని పోలీసులు చెప్పగా.. ఆ ఉత్తర్వులు చూపాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్‌ చేశారు.

Advertisement

Read More: నేడు కోదండరామ్ ఎమ్మెల్సీ ఎన్నికపై హైకోర్టులో విచారణ.. తీర్పుపై ఉత్కంఠ..

సభలో మాట్లాడేందుకు మైక్‌ ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా పాయింట్‌ వద్ద వెళ్లే అవకాశం లేదా? అని వారు ప్రశ్నించారు. బారికేడ్లు అడ్డుగా పెట్టడంతో అక్కడే బైఠాయించి నిరసన కొనసాగించారు. కేటీఆర్‌, హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్‌రెడ్డి, కడియం శ్రీహరి తదితరులు ఈ నిరసనలో పాల్గొన్నారు.

Advertisement

అసెంబ్లీ ప్రాంగణంలో ఎమ్మెల్యేల గొంతు నొక్కి.. ఎమ్మెల్యేలపై ఆంక్షలు ఎందుకని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఇక్కడ ఎందుకు 3-4వేల మంది పోలీసులను మోహరించారని ఆరోపించారు. మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడేందుకు అనుమతి ఇస్తారా లేద కంచెలు బద్దలు కొట్టాలా? అని పాడి కౌశిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags

Related News

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

Big Stories

Advertisement
×