BRS: అసలే అధికారంలో ఉన్న పార్టీ. ఎమ్మెల్యేగా ఉంటే బిందాస్గా సెటిల్ అవ్వొచ్చని అనుకుంటారు. సిట్టింగ్లు రిలాక్స్గా ఉంటే.. ఆశావహులు నెక్ట్స్ టికెట్ తమకే రావాలని గట్టిగా ట్రై చేస్తుంటారు. అందుకోసం, ప్రస్తుత ఎమ్మెల్యేను ఎంతగా బద్నామ్ చేయాలో అంతగా చేస్తుంటారు. అలాంటి వారిలో మహబూబూబాద్ జిల్లా డోర్నకల్ MLA రెడ్యానాయక్ కూడా పార్టీ నేతల బాధితుడే. తన సీటుకు ఎసరు పెట్టారని ఆయన పలు సందర్భాల్లో బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. ఈసారి మరింత సంచలన కామెంట్లు చేశారు. ఇంతకీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఏమన్నారంటే…
తానెప్పుడూ చస్తానా అని చూసేవాళ్లు చాలా మంది ఉన్నారని రెడ్యానాయక్ అన్నారు. తన ఓటమి కోసం గతంలో పని చేశారని.. భవిష్యత్తులో బీఆర్ఎస్ నుంచి కూడా పని చేస్తారని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ లోనే ఇంటి దొంగలున్నారని ఆరోపించారు. పార్టీ పేరు చెప్పుకొని లక్షలు సంపాదిస్తున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తనను ఓడించాటానికి ప్రయత్నాలు చేస్తారని అనుమానం వ్యక్తం చేశారు.
కురవి మండలం అయ్యగారిపళ్లి గ్రామంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన పరోక్షంగా మంత్రి సత్యవతి రాథోడ్ ను టార్గెట్ చేసే ఇలా అన్నారని అంటున్నారు. డోర్నకల్లో రెడ్యానాయక్కు, సత్యవతి రాథోడ్కు చాలాకాలంగా కోల్డ్ వార్ నడుస్తోంది. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. ఆ ఆధిపత్య పోరుతో విసుగుచెంది చేసిన ఆరోపణలు కలకం రేపుతున్నాయి.