Sangareddy: సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చిన్నది మొదలై చివరకు పాకాన పడింది. కొట్టుకునే స్థితికి వెళ్లింది. కేవలం వ్యాపార ఆధిపత్యంపై నలుగుతున్న ఈ వ్యవహారం ముదిరింది. వ్యాపారులు కొట్టుకునే పరిస్థితికి చేరింది. అసలు మేటరేంటి? ఏం జరిగింది?
సంగారెడ్డి జిల్లా జోగిపేట్ పట్టణంలో గొడవలు-సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో బీఫ్-మటన్ దుకాణాల మధ్య గొడవ కొట్టుకునే వరకు వెళ్లింది. షాపుల ఏర్పాటుపై రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణకు దారి తీసింది. అందోల్ ప్రాంతానికి చెందిన కటికే ముస్లింలు-జోగిపేటకు చెందిన ముస్లింల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
బీఫ్ వర్సెస్ మటన్ షాపుల వ్యవహారం-చాన్నాళ్లుగా జరుగుతున్న ఈ వివాదం, శనివారం నాటికి తారాస్థాయికి చేరింది. దీంతో ఇరువర్గాల షాపుల యజమానుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ తర్వాత హింసాత్మకంగా మారింది. వీరి గొడవను అదుపు చేయడానికి చాలామంది ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. రెండు వర్గాలు నేతలు ఎవరి మాట వినలేదు.
రెండు వర్గాల మధ్య ముస్లింల మధ్య గొడవలు-ఫలితంగా కర్రలు-కత్తులతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో జోగిపేటకు చెందిన పలువురు ముస్లిం వ్యాపారులు, యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే స్థానికులు జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి వెళ్లిన తర్వాత గొడవలు మళ్లీ మొదలయ్యాయి.
కర్రలు-కత్తులతో దాడులు, రంగంలోకి పోలీసులు-చికిత్స పొందుతున్న సమయంలో అందోల్కి చెందిన కటికే ముస్లిం వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు ఆసుపత్రిలోకి చొరబడ్డారు. చికిత్స పొందిన బాధితులపై దాడికి దిగారు. దీంతో ఆసుపత్రి ప్రాంగణం రణరంగంగా మారిపోయింది. అసలు గొడవలు ఏంటో తెలియక రోగులు-సిబ్బంది భయాందోళనలకు గురయ్యారు.
ALSO READ: షాబాద్లో ఆరుగురు హత్యలు.. వెలుగులోకి కొత్త విషయాలు, పదునైన కత్తితో- రెండు గంటల్లో
ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇరు వర్గాల వారిని చెదరగొట్టారు. పోలీసులు భారీగా మోహరించడంతో పరిస్థితిని అదుపులో ఉంది. ఈ ఘర్షణ విస్తరించకుండా చర్యలు చేపట్టారు పోలీసులు. జోగిపేట పట్టణంలోని సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలు మోహరించాయి.