E-Paper
Advertisement

జోగిపేటలో టెక్షన్ టెన్షన్.. బీఫ్ వర్సెస్ మటన్ షాపుల వ్యవహారం, రెండు వర్గాల మధ్య ఘర్షణ

జోగిపేటలో టెక్షన్ టెన్షన్..  బీఫ్ వర్సెస్ మటన్ షాపుల వ్యవహారం, రెండు వర్గాల మధ్య ఘర్షణ
Advertisement

Sangareddy:  సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చిన్నది మొదలై చివరకు పాకాన పడింది. కొట్టుకునే స్థితికి వెళ్లింది. కేవలం వ్యాపార ఆధిపత్యంపై నలుగుతున్న ఈ వ్యవహారం ముదిరింది. వ్యాపారులు కొట్టుకునే పరిస్థితికి చేరింది. అసలు మేటరేంటి? ఏం జరిగింది?

సంగారెడ్డి జిల్లా జోగిపేట్ పట్టణంలో గొడవలు-సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో బీఫ్-మటన్ దుకాణాల మధ్య గొడవ కొట్టుకునే వరకు వెళ్లింది. షాపుల ఏర్పాటుపై రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణకు దారి తీసింది. అందోల్ ప్రాంతానికి చెందిన కటికే ముస్లింలు-జోగిపేటకు చెందిన ముస్లింల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

Advertisement

బీఫ్ వర్సెస్ మటన్ షాపుల వ్యవహారం-చాన్నాళ్లుగా జరుగుతున్న ఈ వివాదం,  శనివారం నాటికి తారాస్థాయికి చేరింది. దీంతో ఇరువర్గాల షాపుల యజమానుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ తర్వాత హింసాత్మకంగా మారింది. వీరి గొడవను అదుపు చేయడానికి చాలామంది ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. రెండు వర్గాలు నేతలు ఎవరి మాట వినలేదు.

రెండు వర్గాల మధ్య ముస్లింల మధ్య గొడవలు-ఫలితంగా కర్రలు-కత్తులతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో  జోగిపేటకు చెందిన పలువురు ముస్లిం వ్యాపారులు, యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే స్థానికులు జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి వెళ్లిన తర్వాత గొడవలు మళ్లీ మొదలయ్యాయి.

Advertisement

కర్రలు-కత్తులతో దాడులు, రంగంలోకి పోలీసులు-చికిత్స పొందుతున్న సమయంలో అందోల్‌కి చెందిన కటికే ముస్లిం వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు ఆసుపత్రిలోకి చొరబడ్డారు. చికిత్స పొందిన బాధితులపై దాడికి దిగారు. దీంతో ఆసుపత్రి ప్రాంగణం రణరంగంగా మారిపోయింది. అసలు గొడవలు ఏంటో తెలియక రోగులు-సిబ్బంది భయాందోళనలకు గురయ్యారు.

ALSO READ: షాబాద్‌లో ఆరుగురు హత్యలు.. వెలుగులోకి కొత్త విషయాలు, పదునైన కత్తితో- రెండు గంటల్లో

ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇరు వర్గాల వారిని చెదరగొట్టారు. పోలీసులు భారీగా మోహరించడంతో  పరిస్థితిని అదుపులో ఉంది. ఈ ఘర్షణ విస్తరించకుండా చర్యలు చేపట్టారు పోలీసులు. జోగిపేట పట్టణంలోని సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలు మోహరించాయి.

Related News

షాబాద్‌లో ఆరుగురు హత్యలు.. వెలుగులోకి కొత్త విషయాలు, పదునైన కత్తితో- రెండు గంటల్లో

హైదరాబాద్ వాసులకు అలర్ట్.. నేడు నగరంలోని పలు ప్రాంతాల్లో పవర్ కట్.. ఏ ఏరియాల్లో అంటే?

తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాల జాతర.. 1500 కండక్టర్ పోస్టుల భర్తీ, విద్యార్హతలో తర్జన భర్జన

ఉదయం నిరసన సెగ.. సాయంత్రానికే దిగొచ్చిన హైడ్రా.. బస్తీవాసుల ఆందోళనలకు కమిషనర్ రంగనాథ్ క్లారిటీ

Half Dozen Murders: ఆరుగుర్ని చంపిన ఉన్మాది.. పోక్సోకేసులో రివేంజ్ డ్రామా, రంగారెడ్డి జిల్లాలో దారుణం

ఓఆర్​ఆర్​ పై ఏఐ నిఘా.. ప్రమాదాల నివారణకు పోలీసుల మాస్టర్ ప్లాన్!

కాంగ్రెస్ నేతలకు ‘కంటి ఆపరేషన్’ చేయించాలి.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×