E-Paper
Advertisement

CM Revanth: నర్సంపేటలో రూ.532.24 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన

CM Revanth: నర్సంపేటలో రూ.532.24 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన

CM Revanth: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నర్సంపేట నియోజకవర్గంలో రూ.532.24 కోట్లకు పైగా విలువైన అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. స్థానిక ప్రజలకు మెరుగైన విద్య, వైద్య సదుపాయాలు కల్పించేందుకు, రోడ్డు రవాణా వ్యవస్థను పటిష్టం చేసేందుకు ఈ పనులు ఉపకరిస్తాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. నర్సంపేట సమగ్ర అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఈ శంకుస్థాపనలు ప్రజల చిరకాల ఆకాంక్షలు నెరవేర్చేందుకు తొలి అడుగు అని ఆయన స్పష్టం చేశారు.

ఈ అభివృద్ధి పనులలో ప్రధానంగా రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటుకు శంకుస్థాపన జరిగింది. ఆధునిక విద్యా ప్రమాణాలతో అంతర్జాతీయ స్థాయి వసతులు పాఠశాలలో ఉంటాయి. పేద మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం ఈ స్కూల్ ఏర్పాటు వెనుక ముఖ్య ఉద్దేశం. ఉన్నత విద్య, వైద్య రంగంలో నర్సంపేట కేంద్రంగా మారేందుకు మరో ముఖ్య అడుగు పడింది. రూ.130 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాల వసతి గృహాల నిర్మాణం చేపడతారు. అత్యాధునిక సౌకర్యాలతో వైద్య కళాశాల భవనం, విద్యార్థులకు సరిపడా వసతి సదుపాయాలు ఏర్పాటు చేస్తారు. రూ.26 కోట్లతో ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ భవన నిర్మాణానికి కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. వైద్య సేవలు మరింత విస్తరించేందుకు.. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు ఈ రెండు సంస్థలు కీలకం కానున్నాయి.

రోడ్డు రవాణా మెరుగుదల కోసం ముఖ్యమంత్రి బహుళ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. రూ.82.56 కోట్లతో హన్మకొండ-నర్సంపేట-మహబూబాబాద్ రోడ్డు విస్తరణ మరమ్మతు పనులు చేపట్టనున్నారు. ఈ రహదారి అభివృద్ధి ద్వారా మూడు ప్రాంతాల మధ్య రాకపోకలు సులభతరం అవుతాయి. ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. అంతేకాక.. రూ.56.40 కోట్లతో నర్సంపేట నుంచి నెక్కొండ రోడ్డు విస్తరణ పనులు, రూ.17.28 కోట్లతో నర్సంపేట – పాఖాల రోడ్డు విస్తరణ పనులు ప్రారంభమవుతాయి. ఈ విస్తరణ పనులు పూర్తయితే.. వాహనదారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోగలుగుతారు. నర్సంపేట పట్టణంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఇది దోహదపడుతుంది.

పట్టణ అభివృద్ధికి ముఖ్యమంత్రి ప్రత్యేక నిధులు కేటాయించారు. రూ.20 కోట్లతో నర్సంపేట పట్టణంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ నిధులతో పట్టణంలో మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, తాగునీరు ఇతర పౌర సౌకర్యాలు మెరుగుపడతాయి. నర్సంపేట ప్రజల జీవన ప్రమాణాలు పెంచే దిశగా ఈ నిర్ణయం ఉపకరిస్తుంది. మొత్తం రూ.532.24 కోట్ల నిధులు నర్సంపేట నియోజకవర్గ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చనున్నాయి. ఈ సందర్భంగా జరిగిన సభలో రాష్ట్ర మంత్రులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అభివృద్ధి పనుల వేగవంతమైన, నాణ్యతతో కూడిన పూర్తి బాధ్యత అధికారులకు అప్పగించినట్లు ముఖ్యమంత్రి తెలియజేశారు.

ALSO READ: TG Global Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు రంగం సిద్ధం.. 4,800 మంది ప్రముఖులకు ఆహ్వానం

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×