BigTV English

CM Revanth Reddy : బిగ్ డీల్.. రూ.40,270కోట్ల పెట్టుబడులు.. స్కిల్ యూనివర్శిటీకి అదానీ ఆసక్తి..

CM Revanth Reddy : దావోస్‌ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అండ్‌ టీమ్‌ కృషితో.. రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. పలు సంస్థల అధినేతలతో వరుస భేటీలు నిర్వహించిన సీఎం రేవంత్ బృందం.. కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకుంటుంది. ఈ క్రమంలోనే ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ క్యాంపెయిన్ కు విశిష్ట ఆదరణ లభిస్తుంది. ఈ సదస్సు వేదికగా తెలంగాణకు ఇప్పటి వరకు రూ.40,270 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు వివిధ కంపెనీల తో అగ్రిమెంట్ కుదిరినట్టు సీఎం కార్యాలయం వెల్లడించింది. నిన్న ఒక్కరోజే రూ.37,800 కోట్ల పెట్టుబడులకు పలు దిగ్గజ సంస్థలు ముందుకొచ్చాయి. దీంతో సీఎం రేవంత్ బృందంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

CM Revanth Reddy : బిగ్ డీల్.. రూ.40,270కోట్ల పెట్టుబడులు.. స్కిల్ యూనివర్శిటీకి అదానీ ఆసక్తి..
CM Revanth Reddy news

CM Revanth Reddy news(Latest political news telangana):


దావోస్‌ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అండ్‌ టీమ్‌ కృషితో.. రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. పలు సంస్థల అధినేతలతో వరుస భేటీలు నిర్వహించిన సీఎం రేవంత్ బృందం.. కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకుంటుంది. ఈ క్రమంలోనే ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ క్యాంపెయిన్ కు విశిష్ట ఆదరణ లభిస్తుంది. ఈ సదస్సు వేదికగా తెలంగాణకు ఇప్పటి వరకు రూ.40,270 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు వివిధ కంపెనీల తో అగ్రిమెంట్ కుదిరినట్టు సీఎం కార్యాలయం వెల్లడించింది. నిన్న ఒక్కరోజే రూ.37,800 కోట్ల పెట్టుబడులకు పలు దిగ్గజ సంస్థలు ముందుకొచ్చాయి. దీంతో సీఎం రేవంత్ బృందంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

కాగా ఈ ఒప్పందాలలో అదానీ సంస్థ అత్యధికంగా 12 వేల 400 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుంది. సీఎంతో అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ జరిపిన భేటీలో ఈ మేరకు నిర్ణయం ప్రకటించారు. నైపుణ్య విశ్వవిద్యాలయం స్థాపించేందుకు అదానీ సంస్థ చొరవ చూపించింది. అదే విధంగా పలు విద్యుదుత్పత్తి సంస్థలతో పాటు.. బ్యాటరీ సెల్‌ తయారీ కర్మాగారాలు, జీవ వైద్య ఔషధ సంస్థలు…. డేటా సెంటర్ల స్థాపనకు పలు సంస్థలు అంగీకరించాయి. కొత్తగా కుదిరిన ఒప్పందాల ద్వారా రాష్ట్రంలో వేల సంఖ్యలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని సీఎం రేవంత్ తెలిపారు. ఈ ప్రాజెక్టులకు సహాయ సహకారాలను ప్రభుత్వం అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ చర్చల్లో మంత్రి శ్రీధర్‌బాబు, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌, పెట్టుబడుల ప్రచార ప్రత్యేక కార్యదర్శి విష్ణు వర్ధన్‌రెడ్డి కూడా పాల్గొన్నారు.


అలానే తెలంగాణలో ఔషధాల ఆవిష్కరణ, అభివృద్ధి, సేవలను విస్తరించేందుకు…. ఆరాజెన్‌ లైఫ్‌సైన్సెస్‌…. రూ.2 వేల కోట్ల రూపాయలతో కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందం చేసుకుంది. అంబుజా సిమెంట్ కంపెనీ సైతం 1400 కోట్ల రూపాయలతో పెట్టుబడులు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వెయ్యి కోట్ల రూపాయలతో గోద్రెజ్ కెమికల్ ప్లాంట్ పెట్టుబడులు పెట్టనుండగా… జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ 9వేల కోట్ల రూపాయల పెట్టుబడితో పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక గోడి ఇండియా 8 వేల కోట్లు.. గ్రీన్ వర్క్స్ డాటా సెంటర్ 5 వేల 200 కోట్ల పెట్టుబడులు….. 250 కోట్లతో ఖమ్మంలో పామ్ ఆయిల్ గార్డెన్ లకు సంబంధించి కీలక ఒప్పందాలు జరిగాయి.

Related News

Bigg Boss 9: మాస్క్ మ్యాన్ ఎలాంటి వాడో నిజాలు బయటపెట్టిన భార్య..కొట్టాడు కూడా అంటూ!

Tanushree Dutta: కోట్లు ఇచ్చిన మంచం పై వేరే వ్యక్తితో చెయ్యను..బిగ్ బాస్ కే వార్నింగ్..

Employee Death: సెలవు అడిగిన 10 నిమిషాలకే విగతజీవిగా మారిన ఉద్యోగి.. అసలేం జరిగింది?

Mirai Movie: ‘మిరాయ్‌’ రికార్డు.. విడుదలకు ముందే రూ. 20 కోట్ల లాభం

Illu Illalu Pillalu Today Episode: నర్మద, ప్రేమల మధ్య శ్రీవల్లి చిచ్చు.. ప్రేమ మాటకు ధీరజ్.. మళ్లీ బుక్కయిన ఆనందరావు..

NRSC Recruitment: హైదరాబాద్‌లో ఉద్యోగ అవకాశాలు.. స్టైఫండ్ ఇచ్చి జాబ్.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే ఎనఫ్..!!

Railway Jobs: ఇండియన్ రైల్వేలో 3115 అప్రెంటీస్ ఉద్యోగాలు.. సింపుల్ ప్రాసెస్, అప్లై చేస్తే మీదే ఉద్యోగం

Tamil Nadu Women Dies: పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ.. చనిపోయిన యువతి.. కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో

Big Stories

×