E-Paper
Advertisement

Maganti Gopinath: మాగంటి మరణంపై బండి సంజయ్ ఫిర్యాదు చేస్తే.. విచారణ ప్రారంభిస్తాం: సీఎం రేవంత్

Maganti Gopinath: మాగంటి మరణంపై బండి సంజయ్ ఫిర్యాదు చేస్తే.. విచారణ ప్రారంభిస్తాం: సీఎం రేవంత్
Advertisement

Maganti Gopinath: మాగంటి గోపీనాథ్ మరణంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. బండి సంజయ్ ఫిర్యాదు చేస్తే విచారణ ప్రారంభిస్తామని అన్నారు. మాదాపూర్ పీఎస్ లో కానీ.. డీజీపీకి కానీ ఫిర్యాదు చేయాలని సీఎం తెలిపారు. ఆరోపణలు ఒక్కటే చేస్తే సరిపోదని అన్నారు. మాగంటి తల్లి.. కేటీఆర్ పై ఆరోపణలు చేసినట్టు తనకు తెలిసిందని అన్నారు. ఒక మరణాన్ని వివాదాస్పదం చేసి.. రాజకీయ లబ్ధి పొందాలని తాను అనుకోనని చెప్పుకొచ్చారు. బండి సంజయ్ ఫిర్యాదు చేస్తే విచారణ ప్రారంభిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

అంతకు ముందు కేంద్ర మంత్రి బండి సంజయ్ మాగంటి గోపీనాథ్ మరణంపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌లో మాగంటి గోపినాథ్ గొడవ మొదలైందన్నారు. కుమారుడి మరణం మిస్టరీ అని సొంత తల్లి చెబుతోందని గుర్తుచేశారు. ఆసుపత్రిలో ఉన్న కొడుకుని చూడనివ్వలేదంటే.. మాగంటి తల్లి ఎంత నరకయాతన అనుభవించి ఉంటోందో అర్థం చేసుకోవాలన్నారు. తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనకుండా ఎవరైనా కొడుకుని అడ్డుకుంటారా అంటూ బీఆర్ఎస్ నేతల తీరుపై బండి సంజయ్ మండిపడ్డారు. మాగంటి మరణంపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

ALSO READ: Jubilee Hills: మాగంటి డెత్ మిస్ట‌రీ.. జూబ్లీహిల్స్‌లో కేటీఆర్ చీప్ పాలిటిక్స్.. మరీ ఇంత దిగజారాలా..?

మాగంటి కుటుంబంలో నెలకొన్న ఈ తీవ్రమైన వివాదం, కుమారుడి మిస్టరీ మరణం ఆరోపణలు, అలాగే తండ్రి అంత్యక్రియల్లో కుమారుడిని అడ్డుకోవడం వంటి అంశాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయని పేర్కొన్నారు. అందుకే.. ఈ వ్యవహారం వెనుక ఉన్న వాస్తవాలను వెలికితీయడానికి ప్రభుత్వం తక్షణమే విచారణకు ఆదేశించాలని బండి సంజయ్ చెప్పారు. ఈ కుటుంబ కలహాన్ని బీఆర్‌ఎస్ రాజకీయం చేస్తోందని..తక్షణం జోక్యం చేసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ సంఘటన రాష్ట్ర రాజకీయ వర్గాల్లో మరింత వేడిని రాజేసిందని చెప్పవచ్చు.

Advertisement

ALSO READ: Jubilee Hills By Elections: మాగంటి తల్లి ఆరోపణలపై కేటీఆర్ సమాధానం చెప్పాలి: మంత్రి సీతక్క

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×