E-Paper
Advertisement

Hyderabad: హైదరాబాద్‌లో గంజాయి బ్యాచ్ దారుణాలు.. ఆసుపత్రి సిబ్బందిపై కత్తులతో దాడి!

Hyderabad: హైదరాబాద్‌లో గంజాయి బ్యాచ్ దారుణాలు.. ఆసుపత్రి సిబ్బందిపై కత్తులతో దాడి!
Advertisement

Hyderabad: హైదరాబాద్ లో గంజాయి బ్యాచ్‌ల ఆగడాలు రోజురోజుకూ మితిమీరి పోతున్నాయి. సామాన్య ప్రజలపై దాడులకు పాల్పడుతూ భయాందోళనలు సృష్టిస్తున్న ఈ గంజాయి బ్యాచులు, తాజాగా వనస్థలిపురంలో ఒక దారుణమైన ఘాతుకానికి పాల్పడ్డాయి. ఆసుపత్రి ముందు మద్యం సేవించవద్దని చెప్పిన పాపానికి, ఆసుపత్రి సిబ్బందిపైనే కత్తులతో దాడికి దిగాయి.

వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని జెమ్ కిడ్నీ హాస్పిటల్ ముందు గత రాత్రి 9 గంటల సమయంలో ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది. సుమారు ఆరుగురు యువకులు ఆసుపత్రి ముందు బహిరంగంగా మద్యం సేవిస్తూ, పెద్దగా అరుస్తూ న్యూసెన్స్ సృష్టించారు. ఆ సమయంలో, ఆసుపత్రి సిబ్బంది వేణుగోపాల్ వారి వద్దకు వెళ్లి, “ఇది హాస్పిటల్, లోపల రోగులు (పేషంట్స్) ఉన్నారు. దయచేసి ఇక్కడ అల్లరి చేయవద్దు, ఇక్కడి నుండి వెళ్లిపోండి” అని సున్నితంగా కోరారు.

Advertisement

Read Also: Hyderabad: జగద్గిరిగుట్ట రౌడీ షీటర్ హత్య కేసులో 24 గంటల్లోనే వీడిన మిస్టరీ!

వేణుగోపాల్ మాటలతో ఆగ్రహానికి గురైన ఆ గంజాయి బ్యాచ్, అతనిపై తిరగబడి దాడికి పాల్పడ్డారు. ఇది గమనించిన ఆసుపత్రి రిసెప్షనిస్ట్ విద్యాసాగర్ మరికొంత సిబ్బంది, వేణుగోపాల్‌ను రక్షించేందుకు ప్రయత్నించారు. దీంతో మరింత రెచ్చిపోయిన దుండగులు,  తమ వెంట తెచ్చుకున్న పదునైన కత్తులతో విద్యాసాగర్‌పై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో విద్యాసాగర్‌కు తీవ్రమైన కత్తిపోట్లు తగిలాయి. అతను తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వేణుగోపాల్‌పై కూడా ఈ బృందం దాడి చేసింది.

Advertisement

ఆసుపత్రి సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న వనస్థలిపురం పోలీసులు, పరిస్థితిని సమీక్షించారు. తీవ్రంగా గాయపడిన విద్యాసాగర్‌ను వెంటనే అత్యవసర చికిత్సకు తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దాడికి పాల్పడిన ఆరుగురు యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేవలం చిన్న విషయానికే కత్తులతో దాడి చేసి, ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడని ఈ గంజాయి బ్యాచ్ ఆగడాలపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×