E-Paper
Advertisement

CM Revanth Reddy: డిల్లీలో సీడబ్ల్యూసీ మీటింగ్.. హస్తినకు మరోసారి సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: డిల్లీలో సీడబ్ల్యూసీ మీటింగ్.. హస్తినకు మరోసారి సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: కాంగ్రెస్ ఓబీసీ జాతీయ సలహా మండలి భేటీ జనవరి మూడవ వారంలో హైదరాబాద్ వేదికగా జరగనుంది. ఈ భేటీకి లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరుకానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఓబీసీ వర్గాలకు సంబంధించిన విధానాలు, రాజకీయ వ్యూహాలు, రానున్న ఎన్నికల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఓబీసీలకు కాంగ్రెస్ పార్టీ అనుసరించాల్సిన కార్యాచరణ, సామాజిక న్యాయం అంశంపై స్పష్టమైన దిశానిర్దేశం చేసే అవకాశముందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

ఈ సమావేశానికి సంబంధించి తుది తేదీని ఖరారు చేయడానికి ఈనెల 27న ఢిల్లీలో జరిగే.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశాల అనంతరం ఓబీసీ జాతీయ సలహా మండలి ప్రత్యేకంగా భేటీ కానుంది. ఈ భేటీలో హైదరాబాద్ సమావేశానికి సంబంధించిన తేదీ, ఎజెండా, ఇతర ఏర్పాట్లపై నిర్ణయం తీసుకోనున్నారు.

సీడబ్ల్యూసీ సమావేశం అనంతరం పార్టీ అగ్రనాయకత్వం.. ఈ సమావేశాన్ని అత్యంత ప్రణాళికాబద్ధంగా నిర్వహించేందుకు దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్‌లో జరిగే ఈ సమావేశంలో ఓబీసీ జాతీయ సలహా మండలి ఎజెండాతో పాటు.. శిక్షణ తరగతులు కూడా నిర్వహించనున్నట్లు సమాచారం.

ఈ సమావేశానికి హాజరై చర్చల్లో పాల్గొనాల్సిందిగా.. ఓబీసీ జాతీయ సలహా మండలి సభ్యుడు, మాజీ ఎంపీ హనుమంతరావుకు అధికారిక ఆహ్వానం అందినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆయనతో పాటు దేశవ్యాప్తంగా పలువురు కీలక ఓబీసీ నేతలు ఈ సమావేశంలో పాల్గొనే అవకాశముంది.

సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన

ఇదిలా ఉండగా, ఈనెల 27న ఢిల్లీలో జరిగే సీడబ్ల్యూసీ సమావేశాలకు హాజరయ్యేందుకు.. సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్టీ అగ్రనాయకత్వంతో కీలక అంశాలపై చర్చించడమే కాకుండా, తెలంగాణకు సంబంధించిన పెండింగ్ అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే దిశగా ఆయన ప్రయత్నాలు చేయనున్నట్లు సమాచారం.

సీడబ్ల్యూసీ సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంలోని సంబంధిత శాఖల మంత్రులతో.. విడివిడిగా సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన నిధులు, ప్రాజెక్టులు, అనుమతులు వంటి అంశాలపై చర్చించనున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 28న రాత్రి తిరిగి హైదరాబాద్‌కు చేరుకోనున్నారని, ఆ తర్వాత ఈనెల 29న జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. అసెంబ్లీ సమావేశాల్లో పలు కీలక అంశాలపై ప్రభుత్వం తరఫున సీఎం స్పందించే అవకాశం ఉందని తెలుస్తోంది.

 

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×