E-Paper
Advertisement

CM Revanth Reddy: కేసీఆర్ ఔట్ డేటెడ్ మెడిసిన్.. గులాబీ బాస్‌ తీరుపై సీఎం రేవంత్ ఫైర్..

CM Revanth Reddy: కేసీఆర్ ఔట్ డేటెడ్ మెడిసిన్.. గులాబీ బాస్‌ తీరుపై సీఎం రేవంత్ ఫైర్..
Advertisement
CM Revanth Reddy Fires on KCR

CM Revanth Reddy Fires on KCR(Telangana politics): కేసీఆర్ ఔట్ డేటెడ్ మెడిసిన్ అని తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి విమర్శించారు. ఆయన అధికారం కోల్పోయి అసహనంతో మాట్లాడుతున్నారని అన్నారు. నియమాల ప్రకారం ఛాంబర్ ఇవ్వాలి.. ఇచ్చామన్నారు. కానీ ఇక్కడే ఇవ్వాలి అని లేదా.. ఇది ఇవ్వద్దు అని లేదని సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు.

మేడిగడ్డ మీద చర్చ పక్కదారి పెట్టడానికి కేసీఆర్.. KRMB ఇష్యూ తీసుకుంటున్నారని సీఎం విమర్శించారు. మీ ఆధీనంలో ఉన్న నాగార్జున సాగర్ మీదికి ఏపీ సీఎం జగన్ తుపాకులు పంపి గుంజుకునే పని చేశారన్నారు. మూడు రోజులు పోలీసులు ఉంటే.. అప్పుడు మీరెక్కడ పడుకున్నారని సీఎం ఘాటుగా ప్రశ్నించారు. ప్రతీ రోజు 12 టీఎంసీ నీళ్లు రాయలసీమకు తరలించే పని చేసింది కేసీఆర్ కాదా..? అని రేవంత్ విమర్శలు గుప్పించారు.

Advertisement

కృష్ణా జలాల విషయంలో మాజీ సీఎం చిత్తశుద్ధిని ప్రజలందరూ చూసారన్నారు. అందుకే కృష్ణా పరివాహక ప్రాంతాల ప్రజలు గట్టి తీర్పునిచ్చారని తెలిపారు. అసలు కేసీఆర్, బీఆర్ఎస్ గురించి ప్రజలు ఆలోచించడం మానేశారన్నారు. కేసీఆర్ కమిట్ మెంట్ మీద ప్రజలకు కూడా అర్థమైందని.. దాని మీద ఎవరికైనా డౌట్ ఉందంటే అది హరీష్ రావుకే అని దుయ్యబట్టారు.

Read More : ఉచిత విద్యుత్ పథకంపై సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఫోకస్.. 81 లక్షల దరఖాస్తులు..

Advertisement

సోనియా గాంధీని తెలంగాణ నుండి పోటీ చేయాలని కోరామని సీఎం వెల్లడించారు. మిషన్ భగీరథ ప్రాజెక్టుపై విచారణకు ఆదేశించామని సీఎం పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగానికి కేసీఆర్ హాజరుకాకపోవడంపై సీఎం స్పందించారు. రాష్ట్ర గవర్నర్ ప్రసంగానికి రాలేదంటే అతని బాధ్యత అర్థమవుతోందని అన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

పదేళ్లు శాసన సభ మంత్రిగా చేసిన హరీష్ అవగాహన రాహిత్యం అర్ధమవుతుందని సీఎం మండిపడ్డారు. స్పీకర్ తీసుకునే నిర్ణయానికి మేము భాద్యులం అంటే ఎలా..? అని ప్రశ్నించారు. కేసీఆర్ సభకు రావాలి అని.. ప్రతిపక్ష నేతగా సభలోకి రావాలని కోరుకుంటున్నట్టు రేవంత్ తెలిపారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు సిట్టింగ్ జడ్జిని ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించిందని స్పష్టం చేశారు. రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించుకోవాలని హైకోర్టు సూచించినట్లు తెలిపారు. దీనిపై మంత్రివర్గంలో కానీ అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వం చేశిన తప్పులను పునరావృత్తం చేయమని సీఎం తెలిపారు. ఉద్యోగ నియామక విషయంలో క్లారిటీగా ఉన్నామన్నారు. ఎలాంటి విధానపరమైన లోపాలు లేకుండా పరిపాలన సాగిస్తున్నామని స్పష్టం చేశారు.

Related News

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

Big Stories

Advertisement
×