E-Paper
Advertisement

CM Revanth Reddy: బీఆర్ఎస్‌ ఉనికిని కాపాడే పనిలో పడింది.. సీఎం రేవంత్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

CM Revanth Reddy: బీఆర్ఎస్‌ ఉనికిని కాపాడే పనిలో పడింది.. సీఎం రేవంత్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
Advertisement

సీఎం రేవంత్ రెడ్డి సోమవారం తన మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై మంత్రులకు దిశానిర్దేశం చేసిన సీఎం, రాజకీయంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ప్రతిపక్ష పార్టీ అయిన బిఆర్ఎస్ ప్రస్తుతం తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నాల్లో ఉందని.. ఈ తరుణంలో ప్రభుత్వంపై వారు చేసే విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

నీటి వాటాలపై అప్రమత్తత అవసరం

Advertisement

రాష్ట్ర ప్రయోజనాలకు అత్యంత కీలకమైన నీటి వాటాల విషయంలో మంత్రులందరూ చాలా అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. కృష్ణా, గోదావరి జలాల విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పులను ఎండగడుతూనే.. ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను స్పష్టంగా వివరించాలని సూచించారు. సభలో మంత్రుల అటెండెన్స్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని, ప్రతి అంశంపై పూర్తి అవగాహనతో సిద్ధంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.

విపక్షాలపై అటాకింగ్ వ్యూహం

Advertisement

సభలో ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ ఇచ్చేందుకు మంత్రులు సిద్ధంగా ఉండాలని రేవంత్ రెడ్డి సూచించారు. ముఖ్యంగా జిల్లాల వారీగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు, గత ప్రభుత్వ వైఫల్యాలపై మంత్రులు అటాకింగ్ మూడ్‌లోకి వెళ్లాలని ఆదేశించారు. ‘పాయింట్ ఆఫ్ ఆర్డర్’ వంటి సభా నియమాలను ఉపయోగించుకుంటూ.. ప్రతిపక్షం అడిగే ప్రతి ప్రశ్నకూ సమాధానం ఇవ్వడమే కాకుండా.. వారు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని చెప్పారు.

మంత్రులకు దిశా నిర్దేశం..

అసెంబ్లీ సమావేశాల పొడిగింపు లేదా తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు ఈ నెల 4వ తేదీన మళ్ళీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశం నిర్వహిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ లోపు మంత్రులు తమ తమ శాఖలపై పూర్తి సమాచారంతో ఉండాలని, ప్రజల్లోకి ప్రభుత్వ సందేశాన్ని బలంగా తీసుకెళ్లాలని ఆయన దిశానిర్దేశం చేశారు.

ALSO READ: AP New Districts: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Related News

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Hyderabad: పైరవీలకు చెక్.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, ముఖ్యనేతలకు కీలక సూచనలు

వారెవ్వా గోల్కొండ! భక్తులతో కిక్కిరిసిన కోట.. అధికారుల ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే?

Big Stories

Advertisement
×