E-Paper
Advertisement

AP New Districts: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్

AP New Districts: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
Advertisement

AP New Districts: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో జిల్లాల పునర్విభజన ప్రతిపాదనలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. కేబినెట్ నిర్ణయంతో రాష్ట్రంలో కొత్తగా మదనపల్లె, మార్కాపురం, రంపచోడవం జిల్లాలుగా ఏర్పాటు కానున్నాయి. దీంతో మొత్తం జిల్లాల సంఖ్య 28కి పెరగనుంది. కొత్త జిల్లాలపై ఎల్లుండి తుది గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల కానుంది. అన్నమయ్య జిల్లాలోని రాయచోటిని కొత్తగా ఏర్పడనున్న మదనపల్లె జిల్లాకు కేటాయించారు. రాజంపేటను కడప జిల్లాకు, రైల్వే కోడూరును తిరుపతి జిల్లాకు, గూడూరును తిరుపతి జిల్లా నుంచి నెల్లూరులో కేటాయించారు. ఈ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో కొత్తగా 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆవేదన

రాయచోటిని మదనపల్లెకు కేటాయించడంతో మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. కేబినెట్ సమావేశం అనంతరం కంటతడి పెట్టుకుంటూ బయటకు వచ్చారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని మరో మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ఓదార్చారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో లేకపోవడంపై మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. రాయచోటికి మెడికల్ కాలేజీ మంజూరు చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని మంత్రి తెలిపారు.

Advertisement

Also Read: Pawan Kalyan : పవన్‌కు అక్కడ నో.. ఇక్కడ ఎస్!

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×