AP New Districts: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో జిల్లాల పునర్విభజన ప్రతిపాదనలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. కేబినెట్ నిర్ణయంతో రాష్ట్రంలో కొత్తగా మదనపల్లె, మార్కాపురం, రంపచోడవం జిల్లాలుగా ఏర్పాటు కానున్నాయి. దీంతో మొత్తం జిల్లాల సంఖ్య 28కి పెరగనుంది. కొత్త జిల్లాలపై ఎల్లుండి తుది గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. అన్నమయ్య జిల్లాలోని రాయచోటిని కొత్తగా ఏర్పడనున్న మదనపల్లె జిల్లాకు కేటాయించారు. రాజంపేటను కడప జిల్లాకు, రైల్వే కోడూరును తిరుపతి జిల్లాకు, గూడూరును తిరుపతి జిల్లా నుంచి నెల్లూరులో కేటాయించారు. ఈ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో కొత్తగా 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
రాయచోటిని మదనపల్లెకు కేటాయించడంతో మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. కేబినెట్ సమావేశం అనంతరం కంటతడి పెట్టుకుంటూ బయటకు వచ్చారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని మరో మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ఓదార్చారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో లేకపోవడంపై మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. రాయచోటికి మెడికల్ కాలేజీ మంజూరు చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని మంత్రి తెలిపారు.
Also Read: Pawan Kalyan : పవన్కు అక్కడ నో.. ఇక్కడ ఎస్!