E-Paper

CM Revanth on Kavitha bail: కవిత బెయిల్ వెనుక.. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

CM Revanth on Kavitha bail: కవిత బెయిల్ వెనుక.. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Advertisement

CM Revanth Reddy Reaction on Kavitha bail: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జైలు నుంచి విడుదలయ్యారు. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టై ఐదున్నర నెలలపాటు జైలులో ఉన్న ఆమె మంగళవారం తీహార్ జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే. అయితే, కవిత బెయిల్ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ ను బీజేపీకి ట్రాన్స్ ఫర్ చేశారన్నారు. అందుకే కవితకు ఐదు నెలల్లో బెయిల్ వచ్చిందంటూ సీఎం ఆరోపణలు చేశారు. అయితే, ఇదే కేసులో నిందితుడైన మనీష్ సిసోడియాకు ఏడాది వరకు బెయిల్ రాలేదని, మరో నిందితుడైన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇంకా జైల్లోనే ఉన్నారని గుర్తుచేశారు. కవితకు ఇంత త్వరగా బెయిల్ రావడం వెనుక బీజేపీ మద్దతు ఉందనే అనుమానం కలుగుతోందని అన్నారు. ఎంపీ ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లు గెలవటం కోసం హరీష్ రావు నాయకత్వంలో గులాబీ పార్టీ గట్టిగా పనిచేసిందని, వారి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారమే కవితకు బెయిల్ వచ్చిందని ఆరోపించారు.

కొందరు తనను, మాజీ సీఎం కేసీఆర్‌ను పోల్చే ప్రయత్నం చేస్తున్నారని, నిజానికి తమ ఇద్దరికీ ఎలాంటి పోలిక లేదన్నారు. తాను కొడంగల్, కోస్గి, కొండారెడ్డి పల్లికి మాత్రమే గాక యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్న బాధ్యత గల ముఖ్యమంత్రినని, కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడని పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ తక్షణం ప్రజల కోసం ఫామ్‌హౌజ్ నుంచి బయటికి రావాలి. ప్రతిపక్ష నాయకుడు హోదాలో ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బును జీతంగా తీసుకుంటున్నందుకైనా కేసీఆర్ బయటికి రావాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వ్యవస్థలు కల్పించే సౌకర్యాలను వాడుకుంటూ పనిచేయకుండా కూర్చుంటామంటే కుదరదని స్పష్టం చేశారు. తన కొడుకును కేసీఆరే నమ్మటం లేదని సీఎం వ్యాఖ్యానించారు. కర్ణాటకలో వాల్మీకి స్కామ్‌తో మాకు ఎలాంటి సంబంధమూ లేదని, కర్ణాటక బోర్డర్ ప్రాంతాల్లో ఖాతాలు ఉన్నంత మాత్రాన మాపై ఆరోపణలు చేస్తే ఎలా? అని ప్రశ్నించారు. ఆ స్కామ్‌లో బీఆర్ఎస్ నేతలకే లింకులు ఉండొచ్చని, కొందరు బీఆర్ఎస్ నేతలు డ్రగ్స్ కోసం బెంగుళూరు వెళ్లడం అందరికీ తెలిసిందేనని అన్నారు.

Advertisement

Also Read: జన్వాడ ఫామ్‌హౌస్ వద్ద మరోసారి అధికారుల సర్వే.. చివరకు ఏం తేలిందంటే..?

రుణమాఫీ విషయంలో హరీష్ రావు సవాల్ చేసి పారిపోయారని సీఎం ఎద్దేవా చేశారు. హరీష్ రావు దొంగ అని తనకు తెలుసునని, ఆయనకు రుణమాఫీపై మాట్లాడే నైతిక హక్కు లేదని సెటైర్లు వేశారు. ‘రుణమాఫీ అనేది నా కమిట్మెంట్. నేను చెప్పాను. చేసి చూపించాను. ఈ విషయంపై బీజేపీ, బీఆర్ఎస్ నేతలతో ఏ చర్చకైనా సిద్ధమే’ అని సవాలు విసిరారు. హరీష్ రావు, కేటీఆర్ తెలంగాణలోని ప్రతి రైతు దగ్గరకు వెళ్లి, రుణమాఫీ కాని వారి వివరాలు సేకరించి, జిల్లా కలెక్టరేట్‌లో ఇవ్వటం ద్వారా తమ గత పాపాలను ప్రక్షాళన చేసుకోవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘హరీష్ మంత్రిగా ఉండగా మిషన్ కాకతీయ.. కమిషన్ కాకతీయ అయింది. చెరువుల కబ్జాలపై నిజనిర్ధారణ కమిటీ వేద్దాం. హరీష్ రావును ముందు పెడదాం. ఎవరి కబ్జాలు ఏంటో అప్పుడు తేలుతుంది’ అని కామెంట్ చేశారు. రుణమాఫీపై ధర్నాలు చేసేది బీఆర్ఎస్ కార్యకర్తలేనని, బీఆర్ఎస్ ధర్నాల్లో రైతులు లేరని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరేవారు తమ పాలన నచ్చి చేరుతున్నారని, ఎవరినీ భయపెట్టి పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం లేదని, తమ ప్రభుత్వానికి సరిపడినంత బలం ఉందని తెలిపారు.

Advertisement

రెండు లక్షల రూపాయలకు పైబడిన రుణాల విషయంలో రుణమాఫీ జరగలేదని కొందరు రైతులు కంగారుపడుతున్నారని, వారు ఆ పై మొత్తం కడితే వెంటనే రుణమాఫీ జరుగుతుందని సీఎం హామీ ఇచ్చారు. కాస్త ఆలస్యమైనా అర్హేలైన రైతులందరికీ రుణమాఫీ జరుగుతుందని తెలిపారు. అన్ని జిల్లా కలెక్టరేట్లలో రుణమాఫీ గ్రీవెన్స్ సెల్‌లు పెట్టామని, అధికారులు రుణమాఫీ కానివారి లిస్టులు కలెక్టరేట్‌లో ఇవ్వాలని సూచించారు. ఇప్పటివరకు రూ. 17,933 కోట్లు జమ చేశామని చెప్పారు.

Related News

HCA Probe: ప్రస్తుత పాలకవర్గానికి TG20 నిర్వహించే అర్హత లేదు: హైకోర్టు సంచలనం!

బి.ఆర్. నాయుడిని కలిసిన హైదరాబాద్ వ్యాపారవేత్తలు.. శ్రీవారి అన్నదానానికి భారీ విరాళం!

Bhagirath Bail: బిగ్ బ్రేకింగ్.. బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌కి బెయిల్

NEET Protest: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. నీట్ లీకేజీపై కాక్రోచ్ జనతా పార్టీ ‘థాలీ బజావో’ నిరసన!

Flyover Delay: నిజామాబాద్ లీడర్ల పై ఎంపీ అర్వింద్ సంచలన వ్యాఖ్యలు.. ఎమన్నారంటే..?

మూలనపడ్డ బండ్ల నెంబర్లతో వందల లీటర్ల డీజిల్ మాయం.. జీహెచ్ఎంసీలో ఖరీదైన దందా..!

Singareni Tension: భూపాలపల్లిలో రణరంగం.. సింగరేణి గని వద్ద కవితను అడ్డుకున్న పోలీసులు!

District Review: తెలంగాణలో ఐఏఎస్ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ టాస్క్..?

Big Stories

×