E-Paper
Advertisement

CM Revanth Reddy: కాలేజీ అమ్మాయిలకు ఈవీ స్కూటీలు.. ఉమెన్స్ డే ఈవెంట్‌లో సీఎం రేవంత్

CM Revanth Reddy: కాలేజీ అమ్మాయిలకు ఈవీ స్కూటీలు.. ఉమెన్స్ డే ఈవెంట్‌లో సీఎం రేవంత్

CM Revanth Reddy: అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మహిళలలకు వరాలు జల్లు కురిపించారు సీఎం రేవంత్‌రెడ్డి. హైదరాబాద్ సిటీలో ఈవీ వాహనాలు ఎవరు కొనుగోలు చేసినా జీరో ట్యాక్స్ అని అన్నారు. కాలేజీలకు వెళ్లే అమ్మాయిలకు ఈవీ స్కూటీలు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నట్లు మనసులోని మాట బయటపెట్టారు.

కాలేజీ అమ్మాయిలకు ఈవీ స్కూటీలు-సీఎం రేవంత్ రెడ్డి

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం ప్రజాభవన్‌లో ఏర్పాటు చేసిన వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి, హైదరాబాద్ సిటీ ప్రక్షాళన చేయడానికి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఎయిర్ క్వాలిటీ కూడా చెక్ చేస్తున్నట్లు వివరించారు. అదే సమయంలో మహిళా జర్నలిస్టుల గురించి మాట్లాడారు.

వారికి గుర్తింపు ఇవ్వడమే కాకుండా తెలంగాణ ప్రభుత్వంలో మహిళలు ప్రాధాన్యత ఉందన్నారు.  ఈ దేశానికి రాష్ట్రపతి మొదలు ప్రధాని, లోక్‌సభ స్పీకర్, వివిధ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉందన్నారు. ఈ దేశంలో ఏ పదవైనా మహిళలకు ఇచ్చిన రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. అలాంటి మహిళా నేతృత్వంలో పని చేస్తున్న ఈ పార్టీ, ఉక్కు మహిళ సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పడిందన్నారు.

తెలంగాణ మహిళలు తయారు చేసే వస్తువులను అమెజాన్‌లో అమ్మకానికి అవకాశం కల్పించామన్నారు. స్వయం సహాయక సంఘాలు తయారు చేసే వస్తువులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కేలా చేసినట్టు తెలిపారు. ప్రపంచ దేశాల్లో మహిళల పట్ల వివక్ష ఉందన్నారు. విదేశాల్లో కష్టపడేవారికి గుర్తింపు ఉందని, ముందుకు వెళ్లేవారికి అవకాశం ఉందన్నారు. మన దగ్గర వివక్ష ఉందని, కష్టపడేవారికి గుర్తింపు ఇవ్వాలన్నారు.

మూసీ ప్రక్షాళనపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణలో జనాభా పెరుగుదల కనిపించలేదని, మేమిద్దరం.. మా కొక్కరు అనే పరిస్థితి ఉందన్నారు సీఎం. మేమిద్దరం.. మాకిద్దరు అనే వ్యవస్థ వస్తే జనాభా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మూసీ నది ఒడ్డున గాంధీ విగ్రహానికి ఐదు వేల కోట్లు ఖర్చు చేస్తున్నారనే ప్రచారం ఉందన్నారు. బుర్ర ఉన్న ఎవరైనా విగ్రహం కోసం 5 వేల కోట్లు ఖర్చు చేస్తారా? అంటూ ప్రత్యర్థులకు కౌంటర్ ఇచ్చారు.

విగ్రహం ఖర్చు 70 కోట్లని, మొత్తమంతా కలిపితే రూ. 200 కోట్లు అవుతుందన్నారు. అంబేద్కర్ భవన్ కు 220 కోట్లు ఖర్చు చేశారని, సంతోషమని అన్నారు. మహాత్మాగాంధీ విజ్ఝాన కేంద్రానికి రూ. 200 కోట్లు ఖర్చు చేస్తే తప్పేముందని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.

మూసీని ప్రక్షాళన చేయాలని అంటున్నారని, కానీ ప్రభుత్వం ఏమీ చేయకూడదని అంటున్నారు. దోమలు నియంత్రించాలన్నా, చెత్త తొలగించాలన్న డిమాండ్లు వచ్చినప్పుడు, ఏ కార్యాచరణ చేపట్టకుండా ఇది ఎట్లా సాధ్యం అవుతుందో జర్నలిస్టులు సూచన చేయాలన్నారు. గుజరాత్‌లో సబర్మతి రివర్ ఫ్రంట్, అక్కడి నుంచి 10 వేల కుటుంబాలను తరలించారని అన్నారు. వారికి సరైన ప్యాకేజీ ఇవ్వలేదన్నారు.

ALSO READ: కవిత.. మరో జయలలిత?

గుజరాత్‌లో సబర్మతి రివర్ ఫ్రంట్, అక్కడి నుంచి 10 వేల కుటుంబాలను తరలించారని అన్నారు. వారికి సరైన ప్యాకేజీ ఇవ్వలేదన్నారు. ఢిల్లీలో యమునా నది, యూపీలో గంగా నదులను ప్రక్షాళన చేస్తున్నట్లు చెబుతున్నారని, హైదరాబాద్లో మూసీ ప్రక్షాళన అవసరం లేదా? అంటూ ప్రత్యర్థులకు ప్రశ్నలు సంధించారు.

మూసీ ప్రక్షాళనలో భాగంగా ఇటీవల ఓ అపార్టుమెంట్‌కి సంబంధించి చర్చ జరిగిందని, అందులో జర్నలిస్టు మిత్రులు ఉన్నారని అన్నారు. అది ఏడు ఏకరాల్లో మూసీ ఒడ్డున అపార్టుమెంట్ ఉందన్నారు. వారికి ఏడెకరాలకు సంబంధించి భూమి ప్రభుత్వం ఇస్తుందన్నారు. కొత్తగా నిర్మాణానికి సంబంధించి బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేస్తామన్నారు. మీరు సొసైటీగా ఏర్పడి కట్టించుకోవాలన్నారు. నష్టపరిహారం తీసుకుని వేరే దగ్గర కొనుగోలు చేస్తామంటే మీ ఇష్టమని అన్నారు. దాన్ని రాజకీయ రంగుగా మార్చి, అక్కడికి వెళ్లి వారిపట్ల సానుభూతి చూపిస్తున్నాయిని తెలిపారు. సానుభూతితో సమస్య పరిష్కారం కాదన్నారు.

 

 

Related News

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Big Stories

×