Big Stories

CM Revanth Reddy on KCR: కేసీఆర్ ధన దాహానికి పాలమూరు బలైంది: సీఎం రేవంత్!

CM Revanth reddy Speech in Jathara at Makthal: బీఆర్ఎస్ పాలనలో పాలమూరు నిర్లక్ష్యానికి గురైందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. పదేళ్లు అధికారంలో ఉండి పాలమూరు ప్రాజెక్టును బీఆర్ఎస్ పూర్తి చేయలేదని మండిపడ్డారు. మక్తల్ కాంగ్రెస్ జన జాతర సభలో పాల్గొన్న సీఎం ప్రసంగించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కేసీఆర్ ధన దాహానికి బలైందని అన్నారు.

- Advertisement -

Also Read: 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఉచిత వైద్యం: ప్రధాని మోదీ

- Advertisement -

కొందరు నేతలు ఢిల్లీ సుల్తానులకు బానిసలయ్యారని ఆరోపించారు. కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. పాలమూరును సస్యశ్యామలం చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లా నుంచి కృష్ణా జిలాలు పోతున్నా ఇక్కడి భూములను కేసీఆర్ ఎడారి చేశారని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే పాలమూరు అభివృద్ధి చెందుతుందని తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా వస్తుందని అన్నారు. కాంగ్రెస్ ను ఓడించేందుకు డీకే అరుణ బీజేపీ నేతలతో కలిసి కుట్రలు చేస్తుందని ధ్వజమెత్తారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News