Hyderabad: ఫిఫా వరల్డ్ కప్-2026 టోర్నమెంట్లో వివిధ దేశాల మధ్య మ్యాచ్లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఎవరుపై ఎవరు విజయం సాధిస్తారో చెప్పలేని పరిస్థితి. రాత్రి అర్జెంటినా-ఈజిప్ట్ మధ్య ఉత్కంఠభరితంగా సాగింది. ఈ మ్యాచ్ను విద్యార్థులతో కలిసి సీఎం రేవంత్రెడ్డి వీక్షించారు.
ఫిఫా వరల్డ్ కప్-2026: ఫిఫా వరల్డ్ కప్-2026 టోర్నీలో మ్యాచ్లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ప్రపంచ స్టార్ ఆటగాళ్లు నెయ్మార్, క్రిస్టియానో రొనాల్డో ఒక్క రోజు వ్యవధిలో అంతర్జాతీయ ఫుట్బాల్కు గుడ్ బై చెప్పేశారు. ఈ క్రమంలో మరో దిగ్గజ ఆటగాడు లియోనల్ మెస్సి కూడా గుడ్ బై చెప్పేస్తారన్న సంకేతాల నేపథ్యంలో రాత్రి అర్జెంటినా-ఈజిప్ట్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది.
ఉత్కంఠభరితంగా అర్జెంటినా-ఈజిప్ట్ మ్యాచ్-ఈ మ్యాచ్ తిలకించేందుకు విద్యార్థులతో కలిసి చూశారు సీఎం రేవంత్రెడ్డి. హైదరాబాద్ శిల్పకళా వేదికపై ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఎల్ఈడీ స్క్రీన్పై పాఠశాలల విద్యార్థులతో కలిసి మ్యాచ్ను తిలకించారు ముఖ్యమంత్రి. ఓ వైపు మ్యాచ్.. మరోవైపు విద్యార్థుల కేరింతల మధ్య మ్యాచ్ కోలాహలంగా సాగింది.
విద్యార్థులతో మ్యాచ్ చూసిన సీఎం రేవంత్-అర్జెంటీనా ఆటగాడు లియోనెల్ మెస్సీ ఇటీవల హైదరాబాద్ సిటీలో పర్యటించిన విషయం తెల్సిందే. ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ క్రీడాభిమానులను అలరించాడు మెస్సీ. అట్లాంటా స్టేడియం వేదికగా అర్జెంటినా-ఈజిప్ట్ జట్ల మధ్య సాగింది. చివరివరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ సాగింది.
ఒక్కమాటలో చెప్పాలంటే డిఫెండింగ్ ఛాంపియన్ను ఈజిప్టు వణికించింది. మ్యాచ్లో చాలా సమయం ఆధిక్యంలో ఉన్న ఈజిప్ట్, చివరలో తడబడి ఓటమిని కొని తెచ్చుకుంది. ఓటమి తప్పదని భావించిన తరుణంలో అద్భుతంగా పుంజుకుని చివరి నిమిషాల్లో గోల్స్ మోత మోగించింది అర్జెంటీనా. ఫలితంగా 3-2తో ఈజిప్టుపై విజయం సాధించింది.
ALSO READ: విద్యార్థులకు శుభవార్త.. జూలై 10 నుంచి మూడు రోజులు, పాఠశాలలకు సెలవులు, కాకపోతే
CM Revanth Reddy Watches FIFA World Cup Match with Students
విద్యార్థులతో కలిసి
“ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్ వీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి”శిల్పకళా వేదికలో విద్యార్థులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బిగ్ స్క్రీన్పై అర్జెంటీనా వర్సెస్ ఈజిప్ట్ ఫిఫా వరల్డ్ కప్ ఫుట్బాల్… pic.twitter.com/1u6UWzRQYt
— Congress for Telangana (@Congress4TS) July 7, 2026