CM Revanth Reddy: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత పల్లెల్లో సందడి వాతావరణ నెలకొంది. సర్పంచ్ ఆశావహులు ఏకగ్రీవాలపై పార్టీ నేతలు దృష్టి పెట్టారు. ఈ మేరకు గ్రామస్తులను ఒప్పించేందుకు వివిధ హామీలు కురిపిస్తున్నాయి ప్రధాన పార్టీలు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లిలో సర్పంచ్ స్థానం ఎస్సీకి రిజర్వ్ అయింది. అయితే ఇక్కడ సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైనట్లు తెలిపారు.
సర్పంచ్ ఆశావహులు ఏకగ్రీవాలపై పార్టీ నేతల దృష్టి
నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి పంచాయతీలో సర్పంచ్ స్థానం ఎస్సీకి రిజర్వేషన్ ప్రకటించిన వెంటనే.. సర్పంచ్ పదవి కోసం 15 మంది పోటీ పడ్డట్లు తెలుస్తోంది. పంచాయతీని ఏకగ్రీవం చేసేందుకు స్థానిక నాయకులు కసరత్తు చేపట్టారు.
అన్నీ వార్డు సభ్యుల పదవులకు ఒక్కో నామినేషన్ దాఖలు..
స్థానిక నాయకులు గ్రామస్థులంతా ఏకాభిప్రాయానికి వచ్చి, సర్పంచిగా మల్లెపాకుల వెంకటయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు తీర్మానించినట్లు సమాచారం. కేవలం సర్పంచి పదవికే కాకుండా, అన్ని వార్డు సభ్యుల పదవులకు ఒక్కో నామినేషన్ దాఖలు చేయించి, మొత్తం పాలకవర్గాన్ని పోటీ లేకుండా ఎన్నుకోవాలని స్థానికులు నిశ్చయించినట్లు తెలుస్తోంది.
Also Read: అంబానీ, అదానీల రేంజ్కి ఏమాత్రం తగ్గకుండా.. ఉదయ్పూర్లో ఓ తెలుగమ్మాయి పెళ్లి..
బలమైన రాజకీయ సమన్వయం..
ఈ ఏకాభిప్రాయం వెనుక బలమైన రాజకీయ సమన్వయం కనిపిస్తుంది. ఎస్సీ రిజర్వేషన్ స్థానానికి మల్లెపాకుల వెంకటయ్యను ఏకగ్రీవ అభ్యర్థిగా ఎంచుకోవడం అనేది స్థానిక రాజకీయ వర్గాల మధ్య పూర్తి ఏకాభిప్రాయానికి దారితీసింది. ఈ ప్రక్రియలో సీఎం కుటుంబానికి, స్థానిక నాయకులకు మధ్య ఉన్న సమన్వయం స్పష్టమవుతుంది.