E-Paper
Advertisement

Congress : తెలంగాణపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్.. సెప్టెంబర్ లో 4 బహిరంగ సభలు..

Congress : తెలంగాణపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్.. సెప్టెంబర్ లో 4 బహిరంగ సభలు..
Advertisement

Congress : తెలంగాణపై కాంగ్రెస్ హైకమాండ్ ప్రత్యేక దృష్టి పెట్టింది. కర్ణాటక తరహాలోనే వ్యూహాలు అమలు చేస్తోంది. రాష్ట్రంలో అధికారం దక్కించుకోవటమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ వచ్చారు. గాంధీ భవన్‌లో తెలంగాణ పార్లమెంట్ పరిశీలకులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు. నేతలకు కీలక సూచనలు చేశారు. అన్ని నియోజకవర్గాల్లో నేతలు కలిసి పని చేయాలని స్పష్టం చేశారు.

తెలంగాణలో పార్టీ పరిస్థితి, నేతల పని తీరుపై హైకమాండ్ నిత్యం మానిటరింగ్ చేస్తుందని కేసీ వేణుగోపాల్ తెలిపారు. సర్వేల ప్రకారమే టిక్కెట్‌లు ఇస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ, ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీ ఛైర్మన్ దామోదర్ రాజనర్సింహ పాల్గొన్నారు. నియోజక వర్గాల వారీగా కేసీ వేణుగోపాల్ ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు.

Advertisement

పార్టీ నేతల్లో వేణుగోపాల్ ఆత్మవిశ్వాసం నింపారాన్నారు పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విన్నింగ్ కు దగ్గరలో ఉందని అందరం కలిసి కష్టపడితే గెలుపు సాధ్యమని కేసి వేణుగోపాల్ చెప్పారన్నారు. సెప్టెంబర్ లో నాలుగు భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్టు చెప్పారు. జహీరాబాద్ ,మహబూబ్ నగర్ , నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలో భారీ ఈ సభలు ఉంటాయని తెలిపారు. ఈ సభలకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ హాజరవుతారని తెలిపారు.

Tags

Related News

అసెంబ్లీ సమావేశాల వేళ రేవంత్ సర్కార్‌కు బిగ్ షాక్.. ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

3 ఏళ్ల బాబు మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. కిడ్నాప్ చేసింది వాళ్లే

నకిలీ హిజ్రా మాఫియా పై డీజీపీ ఉక్కుపాదం.. సంచలన ఆదేశాలు జారీ!

తల్లి పదవి పోయిందని సుస్మిత ఏడుపు.. సీఎం రేవంత్‌పై సంచలన వ్యాఖ్యలు

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు.. బూతు పురాణం అంటూ ఫైర్

జూబ్లీహిల్స్ కారా కారా పబ్బులో యువకులు హల్చల్.. పబ్ గొడవలో ఓ కాంగ్రెస్ ఎంపీ కుమారుడు?

పగలు రైతుల వేషం.. రాత్రి వేళ మోటార్ల చోరీ.. జనగామలో దొంగల ముఠా అరెస్ట్!

డీజీపీపై శివాలెత్తిన టీఆర్ఎస్ చీఫ్ కవిత.. చట్టాలు ఉండి ఏం లాభం?

Big Stories

Advertisement
×