E-Paper
Advertisement

Congress: కాంగ్రెస్ ప్రజాకోర్టు.. బోనులో కల్వకుంట్ల కుటుంబం..

Congress: కాంగ్రెస్ ప్రజాకోర్టు.. బోనులో కల్వకుంట్ల కుటుంబం..

Congress: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. నాయకులు స్పీడు పెంచారు. తిరగబడదాం, తరిమికొడదాం.. అంటూ కొత్త నినాదం అందుకున్నారు. అన్ని నియోజకవర్గాల్లో ప్రజాకోర్టులతో సర్కారుపై పోరుబాట ప్రారంభించనున్నారు. బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలపై ఛార్జ్‌ షీట్‌ విడుదల చేయనున్నారు.

ప్రజా సమస్యలను ఎలుగెత్తి చాటేందుకు సరికొత్త కార్యక్రమంతో ముందుకొచ్చింది తెలంగాణ కాంగ్రెస్‌. హైదరాబాద్‌లో ప్రజాకోర్టు నిర్వహించింది. ప్రజాకోర్టు జడ్జీగా ప్రొఫెసర్ కంచె ఐలయ్య వ్యవహరించారు. బోనులో కల్వకుంట్ల కుటుంబాన్ని నిలబెట్టారు. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్‌రావుల కటౌట్లు ఉంచారు. ప్రజాకోర్టులో ఒక్కో అంశంపై.. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను.. ఒక్కో కాంగ్రెస్ నేత ఎండగట్టారు. ఇలాంటి ప్రజాకోర్టులనే తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించనుంది కాంగ్రెస్ పార్టీ.

నెల రోజుల పాటు గ్రామ గ్రామాన బీఆర్ఎస్ వైఫల్యాలపై పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడానికి ప్లాన్ చేశారు హస్తం నేతలు. 12వేల గ్రామాల్లో, 3వేల డివిజన్ స్థాయిలల్లో కాంగ్రెస్ పార్టీ సమావేశాలు జరపనుంది. రాష్ట్ర వ్యాప్తంగా గడప గడపకు వెళ్లి.. 75 లక్షల కుటుంబాలను పార్టీ నేతలు కలవనున్నారు.

వీలైనంత ఎక్కువ మంది ప్రజల్ని భాగస్వామ్యం చేసేలా మిస్డ్ కాల్ నెంబర్ కూడా ప్రకటించింది. కేసీఆర్ పాలనను వ్యతిరేకించే వాళ్లు.. 7661 889 899 ఫోన్‌ నెంబర్‌కు మిస్‌డ్‌ కాల్ ఇచ్చి తమ నిరసనను తెలుపొచ్చు. మరోవైపు, ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టేలా.. పోస్టుకార్డుల ఉద్యమం కూడా ఆరంభించనుంది కాంగ్రెస్. ఇలా పదునైన వ్యూహాలతో కేసీఆర్ సర్కారుపై తిరగబడేలా.. తరిమికొట్టేలా.. ఉద్యమ కార్యచరణ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ.

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×