E-Paper
Advertisement

CPM leaders met CM Revanth: అందుకేనా సమావేశం, అంతా

CPM leaders met CM Revanth: అందుకేనా సమావేశం, అంతా
Advertisement

CPM leaders met CM Revanth:  తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసింది. పార్టీల ఎత్తులు పైఎత్తులు మొదలయ్యాయి. తాజాగా తెలంగాణ సీపీఎం నేతలు సీఎం రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు, వీరయ్య వంటి ముఖ్యమంత్రి నివాసంలో దాదాపు గంటకు పైగా సమావేశమయ్యారు.

ఎన్నికల వేళ మద్దతు, అవలంభించాల్సిన అంశాలపై ఇరువురు నేతలు చర్చించినట్టు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లిన సీపీఎంకు ఊహించని పరాభవం ఎదురైంది. ఈసారి అధికార పార్టీకి మద్దతు ఇవ్వాలని ఆలోచన చేసినట్టు తెలుస్తోంది. ఇందులోభాగంగా శనివారం ఉదయం సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు.

Advertisement

భువనగిరి నుంచి సీపీఎం అభ్యర్థి బరిలో ఉన్నారు. తమ పార్టీ అభ్యర్థి గెలుపొందేందుకు మద్దతు ఇవ్వాలని సీపీఎం నేతలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరినట్టు తెలుస్తోంది. ఇదిలావుండగా వారం కిందట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. సీపీఐ నేతలతో భేటీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా లోక్‌సభ‌కూ పరస్పరం సహకరించుకోవాలని నేతలు భావించారు. సీపీఐకి కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంతో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కూనం సాంబశివరావు గెలుపొందారు.

Advertisement

 

Tags

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×