E-Paper
Advertisement

CPM leaders met CM Revanth: అందుకేనా సమావేశం, అంతా

CPM leaders met CM Revanth: అందుకేనా సమావేశం, అంతా

CPM leaders met CM Revanth:  తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసింది. పార్టీల ఎత్తులు పైఎత్తులు మొదలయ్యాయి. తాజాగా తెలంగాణ సీపీఎం నేతలు సీఎం రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు, వీరయ్య వంటి ముఖ్యమంత్రి నివాసంలో దాదాపు గంటకు పైగా సమావేశమయ్యారు.

ఎన్నికల వేళ మద్దతు, అవలంభించాల్సిన అంశాలపై ఇరువురు నేతలు చర్చించినట్టు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లిన సీపీఎంకు ఊహించని పరాభవం ఎదురైంది. ఈసారి అధికార పార్టీకి మద్దతు ఇవ్వాలని ఆలోచన చేసినట్టు తెలుస్తోంది. ఇందులోభాగంగా శనివారం ఉదయం సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు.

భువనగిరి నుంచి సీపీఎం అభ్యర్థి బరిలో ఉన్నారు. తమ పార్టీ అభ్యర్థి గెలుపొందేందుకు మద్దతు ఇవ్వాలని సీపీఎం నేతలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరినట్టు తెలుస్తోంది. ఇదిలావుండగా వారం కిందట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. సీపీఐ నేతలతో భేటీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా లోక్‌సభ‌కూ పరస్పరం సహకరించుకోవాలని నేతలు భావించారు. సీపీఐకి కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంతో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కూనం సాంబశివరావు గెలుపొందారు.

 

Tags

Related News

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

Big Stories

×