E-Paper
Advertisement

Priyadarshini Raje Scindia got angry at women: ‘నీటి సమస్య వల్ల మా ఊరిలో అబ్బాయిలకు పెళ్లిళ్లు కావడం లేదు’

Priyadarshini Raje Scindia got angry at women: ‘నీటి సమస్య వల్ల మా ఊరిలో అబ్బాయిలకు పెళ్లిళ్లు కావడం లేదు’
Advertisement

Priyadarshini Raje Scindia got angry at women: తమ ఊరికి రోడ్డు లేదనో లేదా రవాణా సౌకర్యం లేదనో తమ ఊరులో ఉన్న యువకులకు పిల్లనివ్వడంలేదనే మాటలు అప్పుడప్పుడు వింటుంటాం. కానీ, ఆ ఊరిలో నీటి సమస్య ఉందని ఊళ్లో యవకులకు పెళ్లిళ్లు కావడంలేదని ఆ గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఆ గ్రామస్తులంతా కలిసి ప్రజాప్రతినిధులను కలిసి తమ గోడును విన్నవించుకున్నారు. అయినా సమస్యకు పరిష్కారం దొరకలేదు. అయితే, తన భర్తకు ఓటు వేసి గెలిపించాలని తమ ఊరికి వచ్చిన కేంద్రమంత్రి భార్యను వారంతా కలిసి కేవలం ఈ సమస్యను పరిష్కారించాలని కోరారు. తమ ఊరిలో నీటి సమస్య ఉంది.. ఆ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ క్రమంలో సమస్య గురించి తనకు రాసివ్వండంటూ కోరింది. మీరే రాసుకోండి మేడం అంటూ ఓ మహిళా బదులిచ్చింది. దీంతో ఆమె ఆగ్రహానికి గురయ్యారు. అందుకు సంబధించిన వీడియో నెట్టింటా వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళితే.. కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా మధ్యప్రదేశ్ లోని గుణ శివపురి లోక్ సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. అయితే, ఆయన సతీమణి ప్రియదర్శినీ రాజే సింధియా తన భర్తకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుంది. ఈ క్రమంలో ఖుజ్రీ గ్రామానికి వెళ్లి తన భర్తకు ఓటు వేయాలని ఓటర్లను కోరింది. ఈ సందర్భంగా కొంతమంది మహిళలు తమ గ్రామంలో నీటి సమస్య తీవ్రంగా ఉందని, ఆ సమస్య వల్ల తాము తీవ్రంగా ఇబ్బందిపడుతున్నామని, అదేవిధంగా తమ గ్రామంలోని అబ్బాయిలకు పెళ్లిళ్లు కావడంలేదంటూ వాపోయారు. వెంటనే ప్రియదర్శినీ రాజే మాట్లాడుతూ ఆ సమస్యల గురించి తనకు ఓ పేపర్ పై రాసివ్వాలని చెప్పింది. వెంటనే ఓ మహిళ స్పందించి ‘మేడం మీరే రాసుకోండి’ అని కోరింది. దీంతో ఆమె ఆగ్రహానికి గురై ‘మీరు మీ గ్రామంలోని సమస్యలు రాసివ్వండి.. అంతేకానీ, మీ పని చేయడం నా పని కాదు’ అని అన్నారు. ఆ వెంటనే మరో మహిళ మాట్లాడుతూ మేడం ఇటు వైపు చూడండి.. ఇక్కడ నీటి ట్యాంక్ ఉంది కానీ, అందులో నీరు ఉండదు అంటూ ప్రియదర్శినీతో వేడుకుంది. అయినా ఆమె సీరియస్ అవుతూ ముందుకెళ్లారు.

Advertisement

Also Read: ఎన్నికల వేళ సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రియాంకా గాంధీ భర్త

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓటర్లు తమ సమస్య గురించి వివరించి, ఆ సమస్యను పరిష్కారించాలని కోరుతుంటే అలా ఆగ్రహం వ్యక్తం చేయడం సరికాదంటూ ఆమెపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

Related News

హస్తిన వైపు కదం తొక్కిన రైతన్నలు.. శంభు బార్డర్ వద్ద హైటెన్షన్, అడ్డుకున్న పోలీసు బలగాలు, ఎందుకు?

పని లేదు.. సగం జీతమే ఇవ్వండి: IAS లేఖ

ప్రియుడిని చంపి, మృతదేహాన్ని కట్ చేసి సంచిలో పెట్టి, ఇంటి యజమానికి వాయిస్ ద్వారా

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

Big Stories

Advertisement
×