E-Paper
Advertisement

Priyadarshini Raje Scindia got angry at women: ‘నీటి సమస్య వల్ల మా ఊరిలో అబ్బాయిలకు పెళ్లిళ్లు కావడం లేదు’

Priyadarshini Raje Scindia got angry at women: ‘నీటి సమస్య వల్ల మా ఊరిలో అబ్బాయిలకు పెళ్లిళ్లు కావడం లేదు’

Priyadarshini Raje Scindia got angry at women: తమ ఊరికి రోడ్డు లేదనో లేదా రవాణా సౌకర్యం లేదనో తమ ఊరులో ఉన్న యువకులకు పిల్లనివ్వడంలేదనే మాటలు అప్పుడప్పుడు వింటుంటాం. కానీ, ఆ ఊరిలో నీటి సమస్య ఉందని ఊళ్లో యవకులకు పెళ్లిళ్లు కావడంలేదని ఆ గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఆ గ్రామస్తులంతా కలిసి ప్రజాప్రతినిధులను కలిసి తమ గోడును విన్నవించుకున్నారు. అయినా సమస్యకు పరిష్కారం దొరకలేదు. అయితే, తన భర్తకు ఓటు వేసి గెలిపించాలని తమ ఊరికి వచ్చిన కేంద్రమంత్రి భార్యను వారంతా కలిసి కేవలం ఈ సమస్యను పరిష్కారించాలని కోరారు. తమ ఊరిలో నీటి సమస్య ఉంది.. ఆ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ క్రమంలో సమస్య గురించి తనకు రాసివ్వండంటూ కోరింది. మీరే రాసుకోండి మేడం అంటూ ఓ మహిళా బదులిచ్చింది. దీంతో ఆమె ఆగ్రహానికి గురయ్యారు. అందుకు సంబధించిన వీడియో నెట్టింటా వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళితే.. కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా మధ్యప్రదేశ్ లోని గుణ శివపురి లోక్ సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. అయితే, ఆయన సతీమణి ప్రియదర్శినీ రాజే సింధియా తన భర్తకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుంది. ఈ క్రమంలో ఖుజ్రీ గ్రామానికి వెళ్లి తన భర్తకు ఓటు వేయాలని ఓటర్లను కోరింది. ఈ సందర్భంగా కొంతమంది మహిళలు తమ గ్రామంలో నీటి సమస్య తీవ్రంగా ఉందని, ఆ సమస్య వల్ల తాము తీవ్రంగా ఇబ్బందిపడుతున్నామని, అదేవిధంగా తమ గ్రామంలోని అబ్బాయిలకు పెళ్లిళ్లు కావడంలేదంటూ వాపోయారు. వెంటనే ప్రియదర్శినీ రాజే మాట్లాడుతూ ఆ సమస్యల గురించి తనకు ఓ పేపర్ పై రాసివ్వాలని చెప్పింది. వెంటనే ఓ మహిళ స్పందించి ‘మేడం మీరే రాసుకోండి’ అని కోరింది. దీంతో ఆమె ఆగ్రహానికి గురై ‘మీరు మీ గ్రామంలోని సమస్యలు రాసివ్వండి.. అంతేకానీ, మీ పని చేయడం నా పని కాదు’ అని అన్నారు. ఆ వెంటనే మరో మహిళ మాట్లాడుతూ మేడం ఇటు వైపు చూడండి.. ఇక్కడ నీటి ట్యాంక్ ఉంది కానీ, అందులో నీరు ఉండదు అంటూ ప్రియదర్శినీతో వేడుకుంది. అయినా ఆమె సీరియస్ అవుతూ ముందుకెళ్లారు.

Also Read: ఎన్నికల వేళ సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రియాంకా గాంధీ భర్త

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓటర్లు తమ సమస్య గురించి వివరించి, ఆ సమస్యను పరిష్కారించాలని కోరుతుంటే అలా ఆగ్రహం వ్యక్తం చేయడం సరికాదంటూ ఆమెపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×