E-Paper
Advertisement

Mahabubabad : కష్టపడి పండించిన మిర్చి పంట.. గుర్తు తెలియని వ్యక్తుల ధ్వంసం..

Mahabubabad : కష్టపడి పండించిన మిర్చి పంట.. గుర్తు తెలియని వ్యక్తుల ధ్వంసం..

Mahabubabad : మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కంబాలపల్లి గ్రామానికి చెందిన సంద యాకయ్య అనే రైతుకు రెండు ఎకరాల భూమి ఉంది. ఒక ఎకరంలో మిర్చి తోట సేద్యం చేశారు. ఆరు గాలం కష్టపడి పండించిన మిర్చి తోట చేతికి అంది వచ్చే సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మిర్చి తోటను ధ్వంసం చేశారు. వేలాది రూపాయలు వెచ్చించి పండించిన పంట మట్టిపాలు అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు.

దీంతో యాకయ్య కుటుంబం వీధిన పడే పరిస్థితి ఏర్పడింది. ఆర్థికంగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. మిర్చి పంటను ధ్వంసం చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని బాధిత రైతు యాకయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Tags

Related News

బిగ్ బ్రేకింగ్.. తెలంగాణలో ఎబోలా వైరస్ అలర్ట్..!

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

Big Stories

×