E-Paper
Advertisement

Dalitha Bandhu Scam: దళితబంధు స్కామ్.. ఒక్కొక్కరి నుంచి రూ.3 లక్షలు వసూలు చేసిన మాజీ ఎమ్మెల్యే

Dalitha Bandhu Scam: దళితబంధు స్కామ్.. ఒక్కొక్కరి నుంచి రూ.3 లక్షలు వసూలు చేసిన మాజీ ఎమ్మెల్యే

Dalitha Bandhu Scam: మెదక్ జిల్లాలో దళిత బంధు లబ్ధిదారుల నుంచి బీఆర్ఎస్ నేతలు డబ్బులు వసూలు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. టేక్మాల్ మండలంలోని పల్వంచ గ్రామానికి చెందిన జంగిడిగళ్ళ భూమయ్యతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు దళిత బంధు రెండో విడతలో భాగంగా లిస్టులో తమ పేర్లు వచ్చాయని ఆందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కు కృతజ్ఞతలు చెప్పేందుకు క్యాంపు ఆఫీసుకు వెళ్లారు.

ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే సోదరుడు రాహుల్ కిరణ్.. వారి వద్ద నుంచి ఒక్కో వ్యక్తి దగ్గర మూడు లక్షల చొప్పున మొత్తం 12 లక్షలు వసూలు చేశారు. అయితే ఎన్నికల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో బాధితులు తమ డబ్బు తిరిగి చెల్లించాలని రాహుల్ ను వేడుకోవడంతో దళిత బంధు కథ అడ్డం తిరిగింది. డబ్బులు ఎవరికి ఇచ్చావు అంటూ బాధితునికి దబాయించే ప్రయత్నం చేశారు రాహుల్ కిరణ్.

అంతేకాకుండా ఫోన్ కాల్ లో నోటికి వచ్చినట్లు బాధితున్ని బూతు పురాణాలతో తిట్టడమే కాకుండా.. ఇంటికి వచ్చి లేపేస్తా అంటూ బాధితుడిని బెదిరించసాగాడు బిఆర్ఎస్ నాయకుడు. దాంతో దళిత బంధు పేరిట ఒక్కొక్కరి దగ్గర 3 లక్షల రూపాయల చొప్పున మొత్తం 12 లక్షలు వసూలు చేశారని బాధితుడు భూమయ్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తాను చెల్లించిన డబ్బులు తిరిగి ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు.

Related News

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

Big Stories

×