E-Paper
Advertisement

President Visit: శీతాకాల విడిది.. నేడు హైదరాబాద్ కు రాష్ట్రపతి

President Visit: శీతాకాల విడిది.. నేడు హైదరాబాద్ కు రాష్ట్రపతి
Advertisement

President Visit: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు హైదరాబాద్ కు రానున్నారు. ఐదు రోజుల శీతాకాల విడిది కోసం ఈరోజు సాయంత్రం 4 గంటల 55 నిమిషాలకు ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి హైదరాబాద్‌ వస్తున్నారు. దుండిగల్‌ లోని ఎయిర్‌ఫోర్స్‌ విమానాశ్రయంలో దిగనున్న రాష్ట్రపతికి.. ఘన స్వాగతం పలికేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అక్కడి నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకోనున్నారు. రాష్ట్రపతి రాకతో హైదరాబాద్ లో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు.. గవర్నర్‌ తమిళి సై, సీఎం రేవంత్‌, మంత్రులు.. పలువురు అధికారులు స్వాగతం పలకనున్నారు. కాగా 20వ తేదీన భూదాన్‌ పోచంపల్లిలో ఆమె పర్యటించనున్నారు. అక్కడ చేనేత ప్రదర్శన తిలకిస్తారు. అలానే ఈనెల 23 వరకు శీతాకాల విడిది చేయనున్న క్రమంలో.. రాష్ట్రపతి పలువురు ప్రముఖులను, సామాన్యులను కలిసే అవకాశమున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా పోలీస్‌ యంత్రాంగం గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement

.

.

Tags

Related News

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

Big Stories

Advertisement
×