BigTV English
Advertisement

Earthquake: తెలంగాణలో భూకంపం.. భయాందోళనలో ఆ జిల్లాల ప్రజలు?

Earthquake: తెలంగాణలో భూకంపం.. భయాందోళనలో ఆ జిల్లాల ప్రజలు?

Earthquake: తెలంగాణలోని పలు జిల్లాలలో భూకంపం వచ్చినట్లు స్థానికులు తెలిపారు. ఆయా జిల్లాలలో ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళన చెందారు. ఉమ్మడి కరీంనగర్, అదిలాబాద్ జిల్లాలలో భూ ప్రకంపనలు కనిపించాయి. పలుచోట్ల మూడు నుండి ఐదు సెకండ్ల పాటు భూమి కంపించిందని సమాచారం.


ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలలో భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఆదివారం సాయంత్రం కొంతసేపు భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో ప్రజలు ఒక్కసారిగా ఇళ్ల బయటకు పరుగులు తీశారు.

సిరిసిల్ల, ఆసిఫాబాద్, కరీంనగర్, నిర్మల్, మంచిర్యాలతో పాటు వెంబడి గ్రామాల్లో కూడా భూమి కంపించిందని స్థానికులు తెలుపుతున్నారు. ఇంట్లో ఉన్న వస్తువులు తడిమినట్లు, బీరువాలల్లోని వస్తువులు కదిలినట్లు కొంతమంది చెబుతున్నారు.


ఇప్పటి వరకు భూకంప తీవ్రతపై భూగర్భ పరిశోధనా విభాగం నుంచి అధికారిక ప్రకటన రాలేదు. ఇది భూకంపమేనా, లేక ఉపరితల ద్రవణమా అన్నది ఇంకా స్పష్టంగా లేదు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా లేదా నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ నుండి నివేదిక రావాల్సి ఉంది.

ప్రత్యేక సూచన..
ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు తెలుపుతున్నారు. అయితే జిల్లా మొత్తం భూకంపం వచ్చినట్లుగా ప్రచారం సాగడంపై అధికారులు ఆరా తీస్తున్నారు.

Also Read: Jubileehills Crime: జూబ్లీహిల్స్‌లో బూతు దందా.. మరో సెక్స్ స్కాండల్ వెలుగులోకి..

గోలేటి సమీపంలో పులికుంట కేంద్రంగా భూకంపం
ఈరోజు సాయంత్రం గం. 6:50:22 ని. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పులికుంట కేంద్రంగా కంపించిన భూమి. కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలతో పాటు జయశంకర్ భూపాలపల్లి, సిరిసిల్ల జిల్లాలలోని పలుప్రాంతాల్లో భూకంప ప్రభావం కనిపించింది. భూకంప తీవ్రత 3.8 గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారిక వెబ్సైట్‌లో పేర్కొన్నది‌.

Related News

Maganti Gopinath: మాగంటి మరణంపై బండి సంజయ్ ఫిర్యాదు చేస్తే.. విచారణ ప్రారంభిస్తాం: సీఎం రేవంత్

Hyderabad: హైదరాబాద్‌లో గంజాయి బ్యాచ్ దారుణాలు.. ఆసుపత్రి సిబ్బందిపై కత్తులతో దాడి!

Nizamabad Encounter: రూ.5 కోట్ల పరిహారం చెల్లించాలి.. NHRCని ఆశ్రయించిన రియాజ్ కుటుంబ సభ్యులు

Jubilee Hills By Elections: మాగంటి తల్లి ఆరోపణలపై కేటీఆర్ సమాధానం చెప్పాలి: మంత్రి సీతక్క

Jubilee Hills: మాగంటి డెత్ మిస్ట‌రీ.. జూబ్లీహిల్స్‌లో కేటీఆర్ చీప్ పాలిటిక్స్.. మరీ ఇంత దిగజారాలా..?

Jubilee Hills bypoll: జూబీహిల్స్‌ బైపోల్‌లో సైలెంట్ వేవ్ రాబోతుంది.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

Cyber Crime Hyderabad: సైబర్ క్రైమ్ పోలీసుల భారీ ఆపరేషన్.. ఒక్క నెలలో 55 మంది అరెస్ట్

Revanth Reddy Birthday: రేషన్ బియ్యంతో.. సీఎం రేవంత్‌కు స్పెషల్ బర్త్ డే గిఫ్ట్

Big Stories

×