E-Paper
Advertisement

Harish Rao: ఇదేం ప్రభుత్వం?.. అటు చదువు లేదు.. ఇటు భోజనం లేదు

Harish Rao: ఇదేం ప్రభుత్వం?.. అటు చదువు లేదు.. ఇటు భోజనం లేదు
Advertisement

– కాంగ్రెస్ పాలనలో గురుకులాల్లో ఘోరాలెన్నో
– విద్యార్థులు చస్తున్నా పట్టింపు లేదా?
– గొడ్డుకారంతో భోజనం పెట్టడం ఏంటి?
– ప్రభుత్వంపై మండిపడ్డ హరీష్ రావు, సబిత
– పాలమాకుల గురుకుల పాఠశాల సందర్శన

Welfare Hostels: ఒకవైపు పాము కాట్లు, ఇంకోవైపు ఎలుకలు కరిచి గురుకులాల్లో విద్యార్థులు ఆస్పత్రుల పాలవుతుంటే ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోందని మాజీ మంత్రులు హరీష్ రావు, సబిత ఇంద్రారెడ్డి మండిపడ్డారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం పాలమాకుల గురుకుల పాఠశాలను వారిద్దరూ సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆడపిల్లలు రోడ్డెక్కి ధర్నా చేస్తే ఎందుకు స్పందించరని హరీష్ రావు నిలదీశారు. ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని, చీమ కుట్టినట్లు అయినా లేదంటూ ఫైరయ్యారు. గురుకులాల్లో కేసీఆర్ సన్న బియ్యంతో అన్నం పెడితే, కాంగ్రెస్ ప్రభుత్వం గొడ్డుకారంతో పెడుతోందని ఆరోపించారు. 500 మంది విద్యార్థులు ఆసుపత్రుల పాలయ్యారని, 38 మంది చనిపోయారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాల పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నదనడానికి ఇదే నిదర్శనమన్నారు. అన్నంలో, పప్పులో పురుగులు ఉన్నాయంటే తినండి అంటున్నారని, ఒక జత బట్టలు మాత్రమే ఇచ్చారని, పుస్తకాలు కూడా ఇవ్వలేదని ఆరోపణలు చేశారు. తమ దీన స్థితిని వ్యక్తం చేస్తూ విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారని అన్నారు.

Advertisement

Also Read: Hyderabad Rains: విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూల్స్, కాలేజీలకు రెండు రోజులు సెలవు

స్వయానా ముఖ్యమంత్రే విద్యా శాఖా మంత్రిగా ఉన్నా, మైనార్టీ గురుకులాలకు జనవరి నుండి మెస్ బిల్లులు ఇవ్వలేదని ఆరోపించారు హరీష్ రావు అన్ని గురుకులాల్లో కాస్మొటిక్ చార్జెస్, కరెంటు బిల్లులు, మెస్ బిల్లులు రావడం లేదన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో గురుకులాల్లో ఘోరాలు ఎక్కువయ్యాయని, అటు విద్య లేదు ఇటు భోజనం లేదని మండిపడ్డారు. కనీస సౌకర్యాలు లేవంటూ కన్నీటి పర్యంతమైన విద్యార్థులను చూస్తుంటే తమకు కన్నీళ్ళు ఆగలేదని వ్యాఖ్యానించారు. సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, గురుకులాల్లో ఇబ్బందులు ఉన్నాయని తాము అసెంబ్లీలో ప్రస్తావిస్తే, ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం స్పందించి రివ్యూ చేశామని కూడా చెప్పలేదన్నారు. ఆడపిల్లలు రోడ్డెక్కి ధర్నా చేస్తుంటే రేవంత్ రెడ్డికి చీమ కుట్టినట్లు కూడా లేదని మండిపడ్డారు.

Related News

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Big Stories

Advertisement
×