Falcon Scam Case: ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ స్కామ్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు రూ.850 కోట్ల భారీ మోసానికి పాల్పడి, పది నెలలుగా తప్పించుకుని తిరుగుతున్న ప్రధాన నిందితుడు కంపెనీ ఎండీ అమర్ దీప్ కుమార్ను ముంబై ఎయిర్ పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గల్ప్ దేశం నుండి ముంబైకి చేరుకున్న అమర్ దీప్ను ఇమ్నిగ్రేషన్ అధికారులు గుర్తించి పట్టుకున్నారు.
అమర్ దీప్పై ఇప్పటికే లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేశారు. ఫాల్కన్ సంస్థ ద్వారా అమర్ దీప్ డిజిటల్ డిపాజిట్లు, యాప్ ఆధారిత పెట్టుబడులతో వేల కోట్ల రూపాయలు కాజేసిట్లు దర్యాప్తులో వెల్లడైంది.
ప్రముఖ ఎంఎన్ సీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిస్తామంటూ, షేర్ మార్కెట్లలో అధిక మొత్తంలో లాభాలు వస్తాయిని నమ్మించి అనేక మంది పెట్టుబడిదారుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు అధికారులు గుర్తించారు. అంతేకాదు ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ద్వారా పెట్టుబడులు పెట్టినట్లుగా చూపిస్తూ.. ఫస్ట్లో కొంత లాభం చూపించి, ఆ తర్వాత భారీ మొత్తాలను అమర్ దీప్ మాయం చేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఫాల్కన్ స్కామ్ ఫాల్కన్ స్కాం వెలుగులోకి రాగానే దుబాయ్కి చార్టెడ్ ఫ్లైట్లో పారిపోయారు అమర్ దీప్ దంపతులు.
ఈ కేసులో ఇప్పటికే ఫాల్కన్ సంస్థకు చెందిన సీఈఓతో పాటు అమర్దీప్ సోదరుడిని అరెస్ట్ చేశారు పోలీసులు.
Also Read: సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. హాలిడేస్ ఎన్ని రోజులంటే..?
ఇక అమర్దీప్ అరెస్ట్తో ఫాల్కన్ స్కామ్కు సంబంధించి.. మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.