BIG Academy: టీమిండియా వరల్డ్ కప్ హీరో, డేంజర్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ ( Yuvraj singh) హైదరాబాద్ లో అడుగు పెట్టారు. సోమవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్న యువరాజ్ సింగ్, శంషాబాద్ విమానాశ్రయంలో సందడి చేశారు. ఈ సందర్భంగా యువరాజ్ సింగ్ కు ఎయిర్ పోర్టులో భారీ ఘన స్వాగతం లభించింది. యువరాజ్ సింగ్ ను చూసేందుకు వేలాదిమంది తరలివచ్చారు. ఇక మంగళవారం సాయంత్రం బిగ్ అకాడమీ (BIG Academy) కార్యక్రమంలో యువరాజ్ సింగ్ పాల్గొననున్నాడు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ చేరుకున్నారు యువరాజ్ సింగ్. ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది.
Also Read: Bangladesh-IPL 2026: బంగ్లాదేశ్ లో ఐపీఎల్ ప్రసారాలు బంద్..బీసీసీఐకి ఎన్ని కోట్ల నష్టం అంటే
హైదరాబాద్ ( Hyderabad ) వేదికగా విద్యారంగంలో సరికొత్త విప్లవానికి శ్రీకారం చుట్టింది బిగ్ అకాడమీ. No torture, just intelligent Learning: BIG Academy s New Age Education Mode అని నినాదంతో ఐఐటి- జేఈఈ , నీట్ లాంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం ఈ నూతన విద్యావేదిక రూపొందించారు. హైదరాబాద్ లోని నోవాటెల్ హెచ్ ఐ సి సి వేదికగా జనవరి 6 అంటే ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం అఫీషియల్ గా ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో బిగ్ అకాడమీ బ్రాండ్ అంబాసిడర్ యువరాజ్ సింగ్ ముఖ్యఅతిథిగా పాల్గొంటారు.
యువరాజ్ సింగ్ తో పాటు ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సివి ఆనంద్, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, బిగ్ టివి వ్యవస్థాపకులు చైర్మన్ విజయ్ రెడ్డి, బిగ్ టీవీ మలయాళం మేనేజింగ్ ఎడిటర్ అనిల్ ఆయుర్ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా విద్యారంగంలో జరిగే ఆవిష్కరణలు, బోధనకు సంబంధించిన టిప్స్ క్లియర్ కట్ గా వివరించే ఛాన్సులు ఉన్నాయి.
రాబోయే రోజులలో తన సాంకేతిక సామర్థ్యాన్ని అలాగే విద్య విభాగాలను మరింత విస్తరించాలని బిగ్ అకాడమీ ఆలోచన చేస్తోంది. వీటి మరిన్ని వివరాల కోసం www.bigacademyedu.com లేదా https://www.bigacademyedu.com అనే వెబ్సైట్స్ సందర్శించుకోవచ్చు. అంతేకాదు, 7710258373 ఈ నెంబర్ కు ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
Also Read: Vaibhav Suryavanshi: వైభవ్ ఊచకోత..68 పరుగులు, అందులో 10 సిక్సర్లు..టీమిండియా విజయం
బిగ్ అకాడమీ వ్యవస్థాపకులు, సీఈవో రమణ భూపతి దీనిపై మాట్లాడుతూ… కేవలం చదువును బట్టీ పట్టే విధానానికి స్వస్తి పలకాలని పేర్కొన్నారు. విద్యార్థులకు అకాడమిక్ పరంగానే కాకుండా మానసికంగా కూడా సపోర్ట్ ను ఇచ్చే వ్యవస్థను నిర్మించడమే తమ లక్ష్యం అని ఈ సందర్భంగా వెల్లడించారు. టెక్నాలజీ తో పాటు మానవ మేధస్సు కలయికతో విద్యార్థులను భావి విజయాలకు సిద్ధం చేస్తామని పేర్కొన్నారు రమణ భూపతి.