BigTV English
Advertisement

Nalgonda Road Accidents : రెండు రోడ్డు ప్రమాదాలు.. కుటుంబంలో ఐదుగురు మృతి..

Nalgonda Road Accidents : రెండు రోడ్డు ప్రమాదాలు.. కుటుంబంలో ఐదుగురు మృతి..

Nalgonda Road Accidents : నల్గొండ జిల్లాలోని నిడమనూరు మండలం వెంపాడ్ లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిని చూడటానికి వస్తూ మరో నలుగురు మృతి చెందారు. రమావత్ కేశవ్ (19) అనే వ్యక్తి రాత్రి నడుచుకుంటూ వెళ్తున్నాడు. నాగరాజు(28) అనే వ్యక్తి బైక్ పై వెళ్తుండగా పొగమంచు కారణంగా దారి కనిపించక.. కేశవ్ ను ఢీ కొట్టాడు. ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న కేశవ్ కుటుంబ సభ్యులు మృతుడిని చూసేందుకు టాటా ఏస్ లో వస్తుండగా పార్వతీపురం దగ్గర ట్యాంకర్ ఢీ కిట్టింది.


ఈ ప్రమాదంలో టాటా ఏస్ లో ఉన్న ఏడుగురు ప్రయాణికుల్లో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు నీమానాయక్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని మల్లెవాని కుంట తండాకు చెందిన రమావత్ కేశవులు, రమావత్ గణ్య, నాగరాజు, రమావత్ పాండు, రమావత్ బుజ్జి లుగా గుర్తించారు. రెండు ప్రమాదాల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చనిపోవటంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.


Related News

Rajendranagar Accident: ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన డీసీఎం వాహనం..

Chittoor Leopard Attack: చిరుతపులి దాడిలో లేగదూడ మృతి.. భయాందోళనలో గ్రామస్థులు

Ahmedabad Crime: దృశ్యం మూవీ తరహాలో.. భర్తని చంపి వంట గదిలో పూడ్చింది, ఆ తర్వాత..

Sangareddy News: చీమల భయం.. అనుక్షణం వెంటాడాయి, నావల్ల కాదంటూ వివాహిత ఆత్మహత్య

Road Accident: బీచ్‌కి వెళ్లి వస్తూ.. బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం అక్కడికక్కడే ఇద్దరు మృతి

Hyderabad News: సహజీవనం.. డ్రగ్స్‌ తీసుకున్న జంట.. ఓవర్ డోస్‌తో ఒకరు మృతి, మరొకరి పరిస్థితి

Hyderabad News: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. నలుగురు చిక్కారు, మరి డ్రోన్ల మాటేంటి?

Bus Fire Accident: మరో ఘోర ప్రమాదం.. మంటల్లో కాలిబూడిదైన ఆర్టీసీ బస్సు

Big Stories

×