E-Paper
Advertisement

Nalgonda Road Accidents : రెండు రోడ్డు ప్రమాదాలు.. కుటుంబంలో ఐదుగురు మృతి..

Nalgonda Road Accidents : రెండు రోడ్డు ప్రమాదాలు.. కుటుంబంలో ఐదుగురు మృతి..

Nalgonda Road Accidents : నల్గొండ జిల్లాలోని నిడమనూరు మండలం వెంపాడ్ లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిని చూడటానికి వస్తూ మరో నలుగురు మృతి చెందారు. రమావత్ కేశవ్ (19) అనే వ్యక్తి రాత్రి నడుచుకుంటూ వెళ్తున్నాడు. నాగరాజు(28) అనే వ్యక్తి బైక్ పై వెళ్తుండగా పొగమంచు కారణంగా దారి కనిపించక.. కేశవ్ ను ఢీ కొట్టాడు. ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న కేశవ్ కుటుంబ సభ్యులు మృతుడిని చూసేందుకు టాటా ఏస్ లో వస్తుండగా పార్వతీపురం దగ్గర ట్యాంకర్ ఢీ కిట్టింది.

ఈ ప్రమాదంలో టాటా ఏస్ లో ఉన్న ఏడుగురు ప్రయాణికుల్లో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు నీమానాయక్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని మల్లెవాని కుంట తండాకు చెందిన రమావత్ కేశవులు, రమావత్ గణ్య, నాగరాజు, రమావత్ పాండు, రమావత్ బుజ్జి లుగా గుర్తించారు. రెండు ప్రమాదాల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చనిపోవటంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.

Related News

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Medchal Crime: అల్వాల్‌లో దొంగల బీభత్సం కలకలం.. 30 తులాల బంగారం చోరీ..!

ఆర్టీసీ బస్సులో గంజాయి దందా.. తనిఖీల్లో పోలీసులకే దిమ్మతిరిగే షాక్!

Big Stories

×