BigTV English

Food poisoning: నాగర్ కర్నూల్‌ జిల్లాలో ఫుడ్ పాయిజన్..40 మందికి అస్వస్థత

Food poisoning: నాగర్ కర్నూల్‌ జిల్లాలో ఫుడ్ పాయిజన్..40 మందికి అస్వస్థత

Food poisoning in NagarKurnool(Telangana news today): నాగర్‌కర్నూల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అచ్చంపేట మున్సిపల్ కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో గురువారం ఫుడ్ పాయిజన్ తో 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన జిల్లాలో కలకలం రేపుతుంది. వెంటనే అప్రమత్తమైన హాస్టల్ సిబ్బంది ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


వివరాల ప్రకారం.. అచ్చంపేటలోని ఉప్పునుంతల రోడ్డు మార్గంలో లింగోటం సమీపంలో ఉన్న ఆక్స్పర్డ్ ప్రైవేట్ పాఠశాలలో హాస్టల్ లో కొంతమంది విద్యార్థులు ఉంటున్నారు. గురువారం ఉదయం 40 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. వెంటనే హుటాహుటిన అంబులన్స్ ద్వారా అచ్చంపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థులు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

విద్యార్థులు గురువారం ఉదయం అల్పాహారం తీసుకున్న తర్వాత ఫుడ్ పాయిజన్ అయిందిం. చపాతీతోపాటు దోసకాయ పప్పుతో ూడిన కూర ఇచ్చారు. ఈ కూరగాయాల్లో రసాయన ఎరువుల ప్రభావం ఎక్కువగా ఉండడంతోపాటు సరిగ్గా శుభ్రం చేయడంతో సిబ్బంది నిర్లక్ష్యం వహించారు. దీంతోనే ఫుడ్ పాయిజన్ అయినట్లు సమాచారం. టిఫిన్ చేసిన తర్వాత విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. దీంతోనే అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.


Also Read: క్షమాపణలు చెప్పిన ‘బిత్తిరి సత్తి’.. అసలేం జరిగిందంటే?

అయితే, ఇటీవల ప్రభుత్వ హాస్టల్ తోపాటు ప్రైవేట్ హాస్టల్లోనూ విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ మేరకు అన్ని హాస్టల్స్‌పై ప్రభుత్వం ఉన్నతాధికారులతో పర్యవేక్షించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రతీ రోజూ ఎక్కడో చోట ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పర్యవేక్షణ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Related News

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో కుండపోత వానలు పడే ఛాన్స్..

Bathukamma: రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు

Karimnagar Fire Accident: కరీంనగర్‌లోని రీసైక్లింగ్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం

Telangana: ఎమ్మెల్సీ తాతా మధుపై ఖమ్మం జిల్లా నేతల తిరుగుబాటు!

Telangana Farmers: అక్టోబర్ తొలి వారంలోనే.. రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ!

TGPSC Group 2: టీజీపీఎస్సీ గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్.. మరో విడత సర్టిఫికెట్ల వెరిఫికేషన్.. షెడ్యూల్ ఇదే

Kalvakuntla Kavitha: కేసీఆర్ అడ్డాలో కవిత.. సీఎం , సీఎం అంటూ అరుపులు

Medaram Festival: మేడారం జాతరకు సీఎం రేవంత్.. అధికారులకు మంత్రి సీతక్క కీలక ఆదేశాలు

Big Stories

×