E-Paper
Advertisement

Gaddar : గద్దర్ అంతిమ యాత్ర ప్రారంభం.. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు..

Gaddar :  గద్దర్ అంతిమ యాత్ర ప్రారంభం.. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు..
Advertisement

Gaddar : ప్రజా గాయకుడు గద్దర్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు గద్దర్‌ భౌతికకాయాన్ని ఎల్బీ స్టేడియంలో ఉంచారు. ఆ తర్వాత అంతిమ యాత్ర ప్రారంభమైంది. ఎల్బీ స్టేడియం నుంచి బషీర్‌బాగ్‌ చౌరస్తా, జగ్జీవన్‌రామ్‌ విగ్రహం మీదుగా గన్‌పార్క్‌ వైపు అంతిమ యాత్ర సాగుతుంది.

అంతిమయాత్రలో కళాకారులు, ఉద్యమకారులు, పలు రాజకీయ పార్టీల నేతలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. గన్ పార్కులోని అమరవీరుల స్థూపం కాసేపు గద్దర్ పార్థీవ దేహాన్ని ఉంచుతారు. పాటలతో కళాకారులు నివాళులు అర్పిస్తారు. అనంతరం గన్‌ పార్క్‌ నుంచి ఆల్వాల్ భూదేవినగర్‌లోని గద్దర్ నివాసానికి పార్థివదేహాన్ని తీసుకెళతారు. అనంతరం గద్దర్ అల్వాల్‌లో స్థాపించిన మహాబోధి విద్యాలయ ప్రాంగణంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.

Advertisement

ఎల్బీ స్టేడియంలో గద్దర్ భౌతికకాయానికి నివాళి అర్పించేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఉదయం నుంచే క్యూ కట్టారు. ఎల్బీ స్టేడియంలో ప్రజా గాయకుడు గద్దర్‌ భౌతికకాయం వద్ద కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులను ఓదార్చారు. తెలంగాణ మంత్రులు కేటీఆర్‌, సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, బీజేపీ నేతలు ఈటల, డీకే అరుణ, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ గద్దర్ కు నివాళులు అర్పించారు.

Tags

Related News

అసెంబ్లీ సమావేశాల వేళ రేవంత్ సర్కార్‌కు బిగ్ షాక్.. ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

3 ఏళ్ల బాబు మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. కిడ్నాప్ చేసింది వాళ్లే

నకిలీ హిజ్రా మాఫియా పై డీజీపీ ఉక్కుపాదం.. సంచలన ఆదేశాలు జారీ!

తల్లి పదవి పోయిందని సుస్మిత ఏడుపు.. సీఎం రేవంత్‌పై సంచలన వ్యాఖ్యలు

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు.. బూతు పురాణం అంటూ ఫైర్

జూబ్లీహిల్స్ కారా కారా పబ్బులో యువకులు హల్చల్.. పబ్ గొడవలో ఓ కాంగ్రెస్ ఎంపీ కుమారుడు?

పగలు రైతుల వేషం.. రాత్రి వేళ మోటార్ల చోరీ.. జనగామలో దొంగల ముఠా అరెస్ట్!

డీజీపీపై శివాలెత్తిన టీఆర్ఎస్ చీఫ్ కవిత.. చట్టాలు ఉండి ఏం లాభం?

Big Stories

Advertisement
×