E-Paper
Advertisement

Gaddar : గద్దర్ అంతిమ యాత్ర ప్రారంభం.. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు..

Gaddar :  గద్దర్ అంతిమ యాత్ర ప్రారంభం.. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు..

Gaddar : ప్రజా గాయకుడు గద్దర్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు గద్దర్‌ భౌతికకాయాన్ని ఎల్బీ స్టేడియంలో ఉంచారు. ఆ తర్వాత అంతిమ యాత్ర ప్రారంభమైంది. ఎల్బీ స్టేడియం నుంచి బషీర్‌బాగ్‌ చౌరస్తా, జగ్జీవన్‌రామ్‌ విగ్రహం మీదుగా గన్‌పార్క్‌ వైపు అంతిమ యాత్ర సాగుతుంది.

అంతిమయాత్రలో కళాకారులు, ఉద్యమకారులు, పలు రాజకీయ పార్టీల నేతలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. గన్ పార్కులోని అమరవీరుల స్థూపం కాసేపు గద్దర్ పార్థీవ దేహాన్ని ఉంచుతారు. పాటలతో కళాకారులు నివాళులు అర్పిస్తారు. అనంతరం గన్‌ పార్క్‌ నుంచి ఆల్వాల్ భూదేవినగర్‌లోని గద్దర్ నివాసానికి పార్థివదేహాన్ని తీసుకెళతారు. అనంతరం గద్దర్ అల్వాల్‌లో స్థాపించిన మహాబోధి విద్యాలయ ప్రాంగణంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.

ఎల్బీ స్టేడియంలో గద్దర్ భౌతికకాయానికి నివాళి అర్పించేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఉదయం నుంచే క్యూ కట్టారు. ఎల్బీ స్టేడియంలో ప్రజా గాయకుడు గద్దర్‌ భౌతికకాయం వద్ద కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులను ఓదార్చారు. తెలంగాణ మంత్రులు కేటీఆర్‌, సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, బీజేపీ నేతలు ఈటల, డీకే అరుణ, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ గద్దర్ కు నివాళులు అర్పించారు.

Tags

Related News

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

Big Stories

×