E-Paper
Advertisement

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్.. ఈడీకి ఫిర్యాదు చేసిన న్యాయవాది సురేష్

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్.. ఈడీకి ఫిర్యాదు చేసిన న్యాయవాది సురేష్

Phone Tapping CasePhone Tapping Case: సార్వత్రిక ఎన్నికల వేళ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు పెను సంచలనంగా మారింది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైకోర్టు న్యాయమూర్తి సురేష్ ఈడీకి ఫిర్యాదు చేశారు.

ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైకోర్టు న్యాయమూర్తి సురేష్ బుధవారం ఈడీకి ఫిర్యాదు చేశారు. ఫోన్ టాపింగ్ కేసులోని నిందితులు వ్యాపారస్తులను బెదిరించి కోట్ల రూపాయలు వసూలు చేశారని న్యాయమూర్తి సురేష్ ఈడీకి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఓ పార్టీ డబ్బులు పోలీసు వాహనాల్లో తరలించారని నిందితులు ఇప్పటికే ఒప్పుకున్నారని తెలిపారు.

నిందితులు వెల్లడించిన ఈ సమాచారం ఆధారంగా ఫోన్ ట్యాపింగ్ పై ED PMLA ఆక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని అడ్వాకేట్ సురేష్ ఈడీని కోరారు. ఈ కేసులో అసలు నిందితులు ఇప్పటివరకు విచారించలేదన్నారు. ED కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తే ఫోన్ ట్యాపింగ్ వెనుకాల ఉన్న రాజకీయ నాయకులు బయటికి వస్తారని అన్నారు.

Also Read: కంటోన్మెంట్ బరిలో లాస్య నందిత సోదరి.. ఖరారు చేసిన కేసీఆర్..

అయితే ఈయన ఈడీకి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఫిర్యాదు చేయడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈడీ రంగప్రవేశం చేస్తే.. ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందోనని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఏ రాజకీయ నాయకుడి మెడకు చుట్టుకుంటుందోనని రాజకీయ చర్చ మొదలైంది.

 

Tags

Related News

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Big Stories

×